యువరత్న నందమూరి బాలకృష్ణ ఇటీవల రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం జరిగింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, తదుపరి చేయబోయే బోయపాటి సినిమాపై బాలయ్య గట్టిగా దృష్టి పెట్టారు. ఇక మరోవైపు నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మరొక స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని జరుపుకుంది. అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఆ సినిమా తెరకెక్కుతోంది. 

 

ఇకపోతే ఎప్పటినుండో నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలని ఎంతో ఆశపడుతున్నారు. అయితే ఆ ఆశ ఎప్పుడు తీరుతుంది అనే విషయం ప్రక్కన పెడితే, ఇటీవల ఎన్టీఆర్ తో తాను తీసిన జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించి ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకుడు కొరటాల శివ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ముఖ్యంగా ఆ సినిమాలో ఎన్టీఆర్ ప్రకృతి ప్రేమికుడిగా నటించడంతో పాటు జనతా గ్యారేజ్ కు రక్షణగా నిలిచి పలువురు ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటాడు. అయితే ఆ గ్యారేజ్ ని స్థాపించే మెకానిక్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు. కాగా ఆ పాత్రలో మోహన్ లాల్ స్థానంలో బాలయ్య ఉండి ఉంటే బాగుండేదని, 

 

ఇద్దరు నందమూరి హీరోలు ఆ సినిమాలో కలిసి నటించి ఉంటె, సినిమా మరింత గొప్పగా సక్సెస్ అయ్యేదని నందమూరి ఫ్యాన్స్ అప్పట్లో అభిప్రాయపడ్డారు. అయితే అదే విషయమై నేడు ఇంటర్వ్యూ లో స్పందించిన కొరటాల, ఒకవేళ మోహన్ లాల్ గారి పాత్రలో బాలయ్య గారిని తీసుకుని ఉంటె, ప్రేక్షకుల దృష్టి సినిమాప కన్నా, వారిద్దరిమీదనే ఉంటుందని, నిజానికి జనతా గ్యారేజ్ సినిమా మంచి కథా బలం ఉన్న సినిమా అని, అందువలన అటువంటి సినిమాలో స్టార్ హీరోలు అయిన బాలయ్య, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే కుదరదని, మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్ లో వారిద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందని అన్నారు. అయితే భవిష్యత్తులో వారిద్దరి కాంబోలో మంచి సినిమా రావాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పిన కొరటాల, తాను కూడా ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానని అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: