సంక్రాంతి కోడిపుంజులు బరిలో కత్తి దూయనిదే పండుగకి కిక్ ఉండదు.. అలాగే సంక్రాంతి నాడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడితే ఆ మజానే వేరు. ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతి బరిలో రెండు బడా హీరోల సినిమాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాలు విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ‘అల..వైకుంఠపురములో’. ఈ సినిమాలో అల్లు అర్జున్కు జోడిగా పూజా హెగ్డే మరోసారి ఆడిపాడింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ తెరకెక్కిన తాజాగా `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12 విడుదల అయింది. అయితే ఈ రెండు సినిమాలకు పాసిటివ్ టాక్ వచ్చాయి. ఇదిలా ఉంటే.. సరిలేరు సినిమాతో అనిల్ రావిపూడి తన మైనస్ పాయింట్ను మరోసారి నిరూపించుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా సెకండాఫ్ చాలా స్లోగా ఉందని అంటున్నారు. ఫస్టాఫ్లోనే మహేష్ చేసే కామెడీతో ప్రేక్షకులు కొంతమేర అసహనానికి గురయ్యారు. ఇక సెకండాఫ్ సాగదీతలా కనిపించడంతో ప్రేక్షకులకు ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు.
ఈ సినిమాను అనిల్ ఓన్లీ మాస్ ఎంటర్టైనర్గా మలిస్తే త్రివిక్రమ్ అన్ని వర్గాలను మెప్పించేలా సినిమా తీసి పైచేయి సాధించాడు. అల వైకుంఠపురములో చిత్రంలో త్రివిక్రమ్ మార్క్ డైలాగులతో పాటు అదిరిపోయే పాటలతో ఫస్ట్ హాఫ్ జాలీగా సాగిపోతుందని తెలుపుతున్నారు. అంతేకాదు ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. అయితే సెకండ్ హాఫ్లో కాస్తా అక్కడక్కడా కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించినా.. పూర్తి ఫీల్తో ఎంజాయ్ చేసే విధంగా సినిమాను రూపొందించారని అంటున్నారు అభిమానులు.