మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా 'అల.. వైకుంఠపురములో' ఇటీవల ఆదివారం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కావడంతో సంక్రాంతి బరిలో వచ్చిన అన్ని సినిమాలలో  'అల.. వైకుంఠపురములో' సినిమా విజేతగా నిలిచింది. ప్రస్తుతం సినిమాకి ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రావడంతో పాటు ఓవర్సీస్లో కూడా అదరగొట్టే కలెక్షన్లు రావడంతో సినిమా నిర్మాతలకు లాభాల పంట పండినట్లే అని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా మార్క్ ఉండటంతో ఓవర్సీస్లో సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉండగా సినిమా సక్సెస్ అవటంతో  'అల.. వైకుంఠపురములో' సినిమా యూనిట్ మొత్తం ప్రస్తుతం సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

 

అయితే ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే సినిమా విషయంలో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో రావడం మొదలుపెట్టాయి. త్రివిక్రమ్ కోర్టులో ఇద్దరి టాప్ హీరోలు పేర్లు ఉన్నట్లు గట్టిగా న్యూస్ వినబడుతోంది. మేటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ తన తర్వాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో అయినా గాని లేకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అయినా గాని చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క త్రివిక్రమ్ మాత్రం తన తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ ఇంకా స్టోరీ సెట్ కాలేదని అంతా సెట్ అయ్యాక అధికారికంగా హీరో ఎవరు అనేది చెప్పే అవకాశం ఉన్నట్లు సన్నిహితుల దగ్గర అన్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా మరోపక్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో ముందుగా షూటింగ్ కంప్లీట్ చేసే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ముందుండటం తో...త్రివిక్రమ్ తో జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ అయితే ప్రస్తుతం  'అల.. వైకుంఠపురములో' సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: