నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరెక్కిన తాజా సినిమా ఎంత మంచివాడవురా మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కుటుంబ కథా సినిమాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం వచించగా శ్రీదేవి మూవీస్, ఆదిత్య మ్యూజిక్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఇటీవల వరుసగా పరాజయాలు ఎదుర్కోవడంతో ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని ఎంతో కసితో పని చేసినట్లు తెలుస్తోంది. 

 

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి సినిమాపై మరింత క్రేజ్ ని తీసుకువచ్చాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, ఎంటర్టైన్మెంట్, హీరో ఎలివేషన్ సీన్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లు టాక్. గతంలో శతమానంభవతి, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాల్లో ఎక్కువగా కుటుంబ కథలకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు సతీష్, ఈ సినిమాలో అటువంటి కథతో పాటు మధ్యలో కొన్ని ఫైట్స్ కూడా పెట్టినట్లు చెప్తున్నారు. ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పరంగా ఎంతో మంచివాడని, 

 

అయితే అతనికి పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమస్యలు ఎదురవడంతో ఎంత మంచివాడైనప్పటికీ ఫైట్స్ కూడా చేయవలసిన సందర్భాలు ఉంటాయట. సినిమాలో ఫైట్స్ నిజంగా ఎంతో బాగా వచ్చాయని, అలానే కొన్ని సీన్స్ లో మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ వంటివి అయితే ఎంతో బాగా కుదిరాయని అంటున్నారు. శరత్ బాబు, సుహాసిని ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తుండగా, రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: