కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గతంలో నటించిన 2.0, పేట సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్నప్పటికీ, ఫ్యాన్స్ ఆశించే రేంజ్ లో మాత్రం అవి సక్సెస్ కాలేదనే అనాలి. నిజానికి రజిని నుండి ఆయన ఫ్యాన్స్ ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమాని ఆశించారు. అయితే ఇటీవల 9వ తేదీన రిలీజ్ అయిన లేటెస్ట్ సినిమా దర్బార్, రజిని ఫ్యాన్స్ ఆశించిన అంశాలతో తెరకెక్కిందని చెప్పాలి. ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాని మంచి మాస్, కమర్షియల్ హంగులతో తెరకెక్కించాడు. ప్రస్తుతం ఒకింత మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతున్న ఈ సినిమాకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించేలా కలెక్షన్ వస్తుండగా, 

 

తమిళనాడులో మాత్రం మంచి కలెక్షన్ రాబడుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీసర్ పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించగా, రజిని కూతురు పాత్రలో నివేత థామస్ నటించింది. అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా సంతోషన్ శివన్ దీనికి ఫొటోగ్రఫీని అందించారు. ఇకపోతే ఈ సినిమా నేటితో ఏకంగా రూ. 150 కోట్ల కలెక్షన్ ని కొల్లగొట్టిందని నిర్మాతలు ప్రకటించడం జరిగింది. 

 

ఇటీవల తెరకెక్కిన 2.0, పేట సినిమాలతో ఒకింత విజయాలు అందుకున్న రజిని, ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని రజిని ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్, మాస్ ఫైట్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిపోయిందని, అలానే రజినీకాంత్ యాక్షన్ అయితే సినిమా మొత్తానికి అతి పెద్ద హైలైట్ అని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మంచి జోరుమీదున్న రజిని, ప్రస్తుతం శివ దర్శకత్వంలో తదుపరి సినిమాలో నటిస్తున్నాడు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: