మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ పక్క నిర్మాతగా మరోపక్క హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలను నిర్మిస్తూ చరణ్ నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రాస్తుతం కొరటాల శివ, చిరు కాంబినేషన్ లో వస్తున్న సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు రాం చరణ్. తను కూడా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న క్రేజీ మూవీ ట్రిపుల్ ఆర్.

 

ఈ సినిమాలో చరణ్ తో పాటుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా మరో బాహుబలి కాదు కాదు అంతకుమించి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తారక్ కోరం భీం పాత్ర.. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నార్. ఈ సినిమాలో ఒలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. చిరు సినిమా తర్వాత కొరటాల శివతో రాం చరణ్ సినిమా ఉంటుందని టాక్ వస్తుంది.

 

రైటర్ నుండి డైరక్టర్ గా మారిన కొరటాల శివ తను తీసిన ప్రతి సినిమాతో హిట్టు కొడుతున్నాడు. 2018లో మహేష్ తో భరత్ అనే నేను సినిమా తీసి హిట్ అందుకున్న కొరటాల శివ చిరుతో కూడా క్రేజీ మూవీ చేస్తున్నాడట. ఇక తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల శివ ఈ సినిమాలో కూడా ఒక వెరైటీ సబ్జెక్ట్ రాసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చిరు తర్వాత చరణ్ ఆఫర్ అందుకున్న కొరటాల శివ అతనికి సక్సెస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: