చిత్ర పరిశ్రమలో వాతావరణం రోజు రోజుకు వేడెక్కింది.. ఇదెలా అంటే నార్త్, సౌత్‌ అని తేడా లేకుండా నిన్నటి వరకు మీటూ వేధింపులంటూ వేధించారు. . అది కాస్త చల్లారిందనుకుంటున్న సమయంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నటీమణులకు వేధింపుల  బెడద ఎక్కువ అవుతుంది.. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయికలకు ఇలాంటివి చాలా అరుదు. ఇకపోతే నటీమణులకు ఈ తరహా వేధింపులు చాలా కాలం నుంచే తలెత్తుతున్నాయి. కాగా ఇప్పుడు నటి నందిత శ్వేత కూడా అసభ్య ఎస్‌ఎంఎస్‌ బెడదను ఎదుర్కొంంటోంది.

 

 

ఇక ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. అందరిలాగే ఈ నటి కూడా తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో తన చిత్రాల వివరాలను, విశేషాలను పంచుకుంటుంది. అలా నందితాశ్వేతను ఇన్‌స్ట్రా గామ్‌లో చాలా మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అయితే అలాంటి వారిలో వాంజి సెలియన్‌ అనే యువకుడు అసభ్య ఎస్‌ఎంఎస్‌లతో  వేధింపులకు గురి చేస్తున్నాడట.

 

 

దీని గురించి నందితాశ్వేత స్పందిస్తూ.. ఆ వ్యక్తి  అసభ్య ఎస్‌ఎంఎస్‌లతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సామాజిక మాధ్యమం ద్వారా  పేర్కొంది. ఇలాంటి వారు కుటుంబ విలువలు తెలుసుకుని ఉండరా.. వారి ఇంట్లో ఆడపిల్లలు లేరా, చీ బుద్దిలేని మనుషులు అంటూ వాపోయింది. అయితే ఈ వ్యవహారంలో పోలీస్‌లకు ఫిర్యాదు చేసే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చింది.

 

 

ఇకపోతే ఈ వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి మరింత రచ్చ చేయడం నందితాశ్వేతకు ఇష్టం లేనట్టుంది. ఇకపోతే తమిళంలో అట్టకత్తి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నందితాశ్వేత ఇక్కడ ఇదర్కు దానే, ఆశైపడ్డాయ్‌ బాలకుమారా తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది హీరోయిన్‌గా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించింది..పేరు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: