అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అల వైకుంఠ పురములో. ఈ  సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎందుకంటే ఇంతకు మునుపు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. దీంతో హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయమని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ ముందు  వచ్చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించి  సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

 

 సినిమా టాక్ పరంగా వసూళ్ళ పరంగా దూసుకుపోతూ... భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టిస్తుంది అల వైకుంఠ పురములో సినిమా. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. గతంలో పూజా హెగ్డే అల్లు అర్జున్ జోడిగా  దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు అలా వైకుంఠపురములో  సినిమాలో మరోసారి ఈ జోడి రిపీట్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుని హిట్ పెయిర్ గా నిలిచింది. ఇక ప్రేక్షకులు కూడా పూజా హెగ్డే అల్లు అర్జున్ జోడికి  బాగా అలవాటు పడిపోయారు. 

 

 

 అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన అల్లు అర్జున్ పూజా హెగ్డే తో మరోసారి నటించాలని ఉంది అంటూ తన మనసులోని మాట చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పూజా హెగ్డే కూడా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించింది. నేను బన్నీ కి పెద్ద ఫ్యాన్ ని.. అతనిలాగా  ప్రతి విషయంలో డెడికేషన్ ఉన్న వ్యక్తిని  నేను ఇప్పుడు వరకు చూడలేదు.. బన్నీ తో పనిచేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. అల వైకుంఠపురములో  సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ డాన్స్ లుక్స్ తో పాటు అన్నింటిలో ఎంతో డెడికేషన్ చూపించి కష్టపడతాడు  అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది పూజా హెగ్డే. ఇక అటు తెలుగు ప్రేక్షకులు కూడా వీరిద్దరి పేరుకి బాగా అలవాటు పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: