గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కలయికలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించడం జరిగింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి కలయికలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో, సంక్రాంతి కానుకగా మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించిన విషయం తెలిసిందే. మంచి ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎక్కుగా ఏ సెంటర్స్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 

 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బి, సి సెంటర్స్ లో మాత్రం ఆశించిన రేంజ్ లో కలెక్షన్ రాబట్టడం లేదట. కాగా సరిగ్గా ఈ సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరుకు కొంత మిశ్రమ స్పందన లభించింది. అయితే ఆ సినిమాకు ఆ విధమైన టాక్ రావడం ప్రస్తుతం అలవైకుంఠపురములో సినిమాకు కలసి వచ్చిందని, నిజానికి గతంలో వచ్చిన పలు త్రివిక్రమ్ సినిమాల కలబోతగా తెరకెక్కిన ఈ సినిమాలో పర్వాలేదనిపించే కథ, కథనాలు ఉండడంతో పాటు సరిలేరుకు పెద్దగా టాక్ రాకపోవడం బాగా కలిసి వచ్చిందని, అలానే రజిని దర్బార్ కూడా యావరేజ్ గా నిలవడం కూడా అలకు మేలు చేసిందని, 

 

ఈ విధంగా కిందా, మీద పడి ఎలాగో ఈ అలవైకుంఠపురములో సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ సినిమా అనే పేరు దక్కించుకుందని అంటున్నారు కొందరు ప్రేక్షకులు. త్రివిక్రమ్ పెన్నుకు ఎంతో పవర్ ఉందని, ఆయన మాటలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, కొన్ని సీన్స్ కాపీ కొట్టే విషయమై మాత్రం ఆయనలో మార్పు రావడం లేదని చెప్తున్నారు. అదే కనుక అవి తగ్గించుకుని త్రివిక్రమ్, ఇకపై తన సినిమా కథ, కథనాలపై కనుక మరింత గట్టిగా దృష్టి పెట్టగలిగితే, తప్పకుండా ఆయన నుండి సూపర్ హిట్ రావడం ఖయాం అని అభిప్రాయపడుతున్నారు. మరి దానిని రాబోయే రోజుల్లో గురూజీ త్రివిక్రమ్ ఎంతవరకు నిజం చేస్తారో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: