సూపర్ స్టార్ మహేష్ బాబు... తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరుకు ఇంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి  సూపర్ స్టార్ కృష్ణ తో బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా పరిచయమై తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ సూపర్ స్టార్ గా మారిపోయాడు మహేష్ బాబు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. విభిన్నమైన కథాంశంతో ఉన్నా సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో నటనతో అదరగొట్టు ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహేష్ బాబు. 

 

 

 వరుస సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మహేష్ బాబు... వరుస విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక తాజాగా జనవరి 11న సంక్రాంతి ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోయింది. అనిల్ రావిపూడి కామెడీకి... మహేష్ బాబు టైమింగ్ తోడవడంతో సినిమా బంపర్ హిట్ సాధించింది. భారీ విజయాన్ని సాధించి భారీ వసూళ్లు దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరి పోయింది సరిలేరు నీకెవ్వరు సినిమా. 

 

 

ఇక తాజాగా  సంక్రాంతి సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ వ్యాపారం తమ ఇమేజ్ కన్నా ప్రేక్షకుల ఆనందమే తమకు ఎంతో ముఖ్యమని మహేష్ బాబు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ బంగారం అని.. తెలుగు చిత్ర పరిశ్రమ పరిధి రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది అంటూ మహేష్ బాబు తెలిపారు. చిన్నప్పుడు బుర్రుపాలెంలో సంక్రాంతి పండుగను జరుపుకునే వాడిని అంటూ తెలిపారు మహేష్ బాబు. ఇప్పుడు సినిమానే తనకు సంక్రాంతి పండుగ అని  మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఈ సంక్రాంతికి ముందు విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా బంపర్ హిట్ తో నిజంగానే మహేష్ బాబుకు  సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: