సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాను దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. ఫ‌స్ట్ టైమ్ ఈ సినిమాలో మ‌హేష్ ఓ ఆర్మీలో మేజర్ గా న‌టించాడు. గతేడాది ‘మహర్షి’ సినిమాతో బాక్సాఫీస్‌ను పలకరించిన మహేష్ బాబు.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రోవైపు ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. 

 

ఇక విడుద‌లైన మొద‌టి రోజు పాసిటివ్ టాక్ రావ‌డంతో ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందు నుంచీ అందరూ ఊహిస్తూనే ఉన్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా వసూళ్లు రాబడతాయని ఎవ్వరూ ఊహించలేదు. క్లాస్, మాస్ సెంటర్స్ అనే తేడాలేకుండా అన్నిచోట్లా మహేష్ మానియా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా జోరుమీదుంది. మొదటి మూడు రోజులు కుమ్మేసిన మహేష్.. నాలుగో రోజు కూడా అదే ఫామ్ కొనసాగించారు.

 

మొదటి రోజు 32.64 కోట్ల షేర్ మార్క్ తో అల్ టైం నాల్గవ స్థానంలో నిలిచింది. రెండవరోజు 9.5 కోట్ల షేర్ సాధించి, మూడవ రోజు 7.21 కోట్ల షేర్ సాధించి 50 కోట్ల షేర్ మార్క్ కి చేరువైంది. అలాగే నాలుగో రోజు భోగి పండుగ సంద‌ర్భంగా మళ్ళీ సూపర్బ్ గ్రోత్ తో 9 కోట్ల షేర్ రాబట్టుకొని 4 రోజుల్లో 58.3 కోట్ల షేర్ ని సాధించింది. పండగ సెలవులు ఇంకా ఉండటంతో ఇప్పట్నుంచి అసలు రచ్చ షురూ కానుంది. బి, సీ సెంటర్స్‌లో సరిలేరు నీకెవ్వరు దూసుకుపోతుంది. 

 

‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 4 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

 

నైజాం- 19.04 కోట్లు

 

సీడెడ్- 7.99 కోట్లు

 

గుంటూరు- 6.7 కోట్లు

 

ఉత్తరాంధ్ర- 8.02 కోట్లు

 

తూర్పు గోదావరి- 5.35 కోట్లు

 

పశ్చిమ గోదావరి- 4.05 కోట్లు

 

కృష్ణా- 5.01 కోట్లు

 

నెల్లూరు- 2.14 కోట్లు
--------------------------------------------------------
నాలుగు రోజుల మొత్తం షేర్- 58.3 కోట్లు
--------------------------------------------------------

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: