సినిమా రిలీజ్ అయ్యి వారం కాలేదు అప్పుడే టీవీలో వచ్చింది.. అసలు ఎంత బాధ ఉంటుంది.. సినిమా తీసిన వారికీ.. మొదటి రోజు వేలు వేలు టికెట్ కి ఖర్చు పెట్టిన అభిమానులకు ఈ ఘటన వింటే ఎంత బాధ వేస్తుంది. సినిమా అంటేనే థియేటర్ చూడాలి.. అలాంటిది సూపర్ స్టార్ సినిమాలు అయితే టీవీలో రావడానికి కనీసం ఆరు ఏడు నెలలు పడేది ముందుకాలంలో.. 

 

కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా నెల రోజులకే హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఇలా అన్ని రకాల ఆన్లైన్ లో సినిమాలు వచ్చేస్తున్నాయి.. ఇవి అయినా నెలకు వస్తున్నాయి. ఇంకా మూవీ రూల్స్ వంటి వాటిలో అయితే సాయింత్రానికి వచ్చేస్తాయి. అలాంటి పైరసి సినిమాలను మూసెయ్యాలని ఎంత ప్రయత్నించినా సరే.. 

 

ఆ పైరసీ అనేది పోయేది కాదు. అలాంటి పైరసీకి వ్యతిరేకంగా ఉండాల్సిన టీవీ మీడియానే.. అదే పైరసీ కాపీని తమ చానల్ లో ప్రసారం చేశారు. అయితే అది మన తెలుగులో కాదు.. తమిళ్ లో. ఆ సినిమా మరెవరిదో కాదు రజినీకాంత్ దర్బార్ సినిమా. ముందు గురువారం రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. 

 

సినిమా పైరసీని తమిళ్ లో శరణ్య ఛానల్ లో ప్రసారం చేశారు. ఈ నెల 12న తమ టీవీలో ప్రసారం చేసేశారు. అయితే ఈ విషయం చిత్రం నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ దృష్టికి వచ్చింది. వెంటనే నిర్మాతలు ఆ టీవీపై కేసు వేశారు. అయితే ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రొడక్షన్ సంస్ద వాళ్ళు కోరారు.

 

అయితే ఇప్పటి వరుకు ఈ వ్యవహారంపై.. ఆ చానల్ నిర్వాహకులు స్పందించలేదు కానీ.. దర్బార్ నిర్మాతల ఆగ్రహం చూస్తుంటే.. వారికి తగిన శిక్ష పడేదాకా వదిలేట్టు కనిపించడంలేదు. మరి ఈ విషయంపై చివరికి ఏమి అవుతుందో చూడాలి.. ఏది ఏమైనా ఆలా చెయ్యడం అన్యాయం కదండీ.. మీరేం అంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: