నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే లైన్లో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించిన "వి" సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మోహన క్రిష్ణ దర్శకత్వంలో నాని ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. నాని చేసిన మొదటి సినిమా అష్టా చమ్మా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి మోహన క్రిష్ణే దర్శకుడు.

 

ఇక ఆ తర్వాత జెంటిల్ మేన్ అంటూ మరో సినిమా తీశాడు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వి చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇంద్రగంటి స్టైల్ ఆఫ్ మేకింగ్, నాని నటన ఇవన్నీ కాక సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని ప్రకటించారు కూడా.. అదీ గాక నార్త్ లోని పర్వత ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. వీటన్నింటిని బట్టి సినిమాలో ఏదో ఆసక్తికరమైన అంశం ఉందని వినిపిస్తుంది..

 

అయితే ఈ సినిమా షూటింగ్ నిన్నటికి అయిపోయిందట. సంక్రాంతికి షూటింగ్ ని ముగించుకుని ఉగాదికి ప్రేక్షకుల ముందుకి వస్తారట. ఈ మేరకు ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించాడు. ఈ చిత్రంలో నాని తో పాటు సుధీర్ బాబు కూడా హీరోగా కనిపిస్తున్నాడు. హీరోయిన్లుగా నివేథా థామస్ మరియు అదితీ రావ్ హైదరీ నటిస్తున్నారు. గతంలో చూడని విధంగా ఈ సినిమాలో నాని లుక్ ఉంటుందని సమాచారం. 

 

నాని ఫుల్ లెంగ్త్ విలన్ గా నటించిన ఈ సినిమా సెంట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని కెరీర్లో  25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ - లక్ష్మణ్ - హర్షిత్ నిర్మిస్తున్నారు. 'సైరా' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ మూవీ విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: