టాలీవుడ్ లో బాలీవుడ్ భామలు ఈ మధ్య వరుసగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో బాలీవుడ్ హీరోయిన్లు ఇలా కనిపించి అలా మాయమయ్యే వారు.. కొంతమంది ఐటెం సాంగ్స్ కి పరిమితం అయ్యేవారు. అయితే రకుల్ ప్రీత్ లాంటి బాలీవుడ్ బ్యూటీ వరుసగా నాలుగేళ్ల నుంచి సూపర్ హిట్ మూవీస్ అందుకుంటూ కెరీర్ సక్సెస్ లో సాగుతోంది. ఈ నేపథ్యంలో ముకుందా ఒక లైలా కోసం మూవీస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పూజా హెగ్డే చాలా సాంప్రదాయంగా కనిపించింది. అదే ఈ అమ్మడికి మైనస్ గా మారి వరుసగా ఏ ఛాన్స్ లు రాలేదు.
ఒక లైలా కోసం తర్వాత ఈ అమ్మడు నటించిన దువ్వాడ జగన్నాథం సూపర్ డూపర్ హిట్ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం మూవీ లో పూజా హెగ్డే బికినీ సీన్ లో దుమ్ము రేపింది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ , మహేష్ బాబు, వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురం లో మూవీ తో మరో సక్సెస్ను అందుకుంది.
దాంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ బాలీవుడ్ లో మంచి డిమాండ్ పెరిగిపోయింది. సినిమాలు కూడా వరుసగా హిట్ అవ్వుతుండడంతో రెమ్యునరేషన్ ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే మూవీ రూపొందుతోంది. కాగా ఈ మూవీలోని ఒక కీలక పాత్ర కోసం నమ్రత పూజ హెగ్డేని సంప్రదించగా ఆమె ఏకంగా రెండు కోట్ల పారితోషకం అడిగిందట. దాంతో పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంచిందట ఈ చిత్ర బృందం.