ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ నాలుగు సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' భారీ సినిమా. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మహేష్ మాస్ ఎంటర్టైనర్ చెయ్యడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి నెలకొంది.  మహేష్ కూడా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో సంతోషంగా ఉన్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి క్లాస్ ఎంటర్‌టైనర్స్ తర్వాత వచ్చిన సరిలేరు పక్కా క్లాస్ సినిమా కావడంతో మహేష్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న 13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి స్పెషల్ అట్రాక్షన్ ప్రేక్షకులకు ఇంకా ఉత్సాహాన్నిచ్చింది. దాంతో సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా యూనిట్ ఉత్సాహం మాత్రం మామూలుగా లేదు.  

 

ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మహేష్ ను చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా(దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యే) సినిమాలు చేస్తున్నారు.. మీకు అలా పాన్ ఇండియా సినిమా చేసే ఆలోచన ఉందా అని అడిగారు. అయితే మహేష్  ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని.. తెలుగు సినిమాలు చేయడం తనకు హ్యాపీ అని.. ఇలానే కంటిన్యూ అవుతానని  నిర్మొహమాటంగా చెప్పారు. పాన్ ఇండియా సినిమాలు అంటే పక్కాగా ప్లాన్ చేస్తే వర్క్ అవుట్ కావని.. అలాంటి కథలు వాటంతట అవే వస్తాయని అన్నారు. 

 

ఈలెక్కన ఇతర స్టార్ హీరోల తరహాలో మహేష్ కు పాన్ ఇండియా సినిమాలు చేసే ఉద్దేశం లేనట్టేనై దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతోంది. ఒకవేళ మహేష్ నటించిన సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉంటే మాత్రం ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారని మాత్రం తెలుస్తోంది. ఇక 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమాను మే నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: