అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అయితే ఈమె ఇటు జబర్దస్త్ చేస్తూనే అటు జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గాంగ్స్ కార్యక్రమంలో జడ్జ్ కూడా వ్యవహరిస్తోంది. అలాగే కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
వాస్తవానికి పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ప్లానింగ్ సరిగ్గా ఉంటే సినిమాల్లో కూడా విజయం మీ వెంటే వస్తుందని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా తాను హోస్ట్గా మరో కొత్త షోను మొదలుపెడుతున్నారు ఈ స్టార్ యాంకర్. ‘ప్రతిరోజూ పండగే’ పేరుతో మల్లెమాల టీవీ ప్రొడక్షన్లో కొత్త షోను చేస్తున్నారు అనసూయ. ఈ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక మల్లెమాల టీవీ ప్రొడక్షన్ కాబట్టి ఈటీవీలోనే ఈ షో ప్రసారం జరుగుతుంది. ఈ షో ద్వారా సెలబ్రిటీలతో కలిసి ఆడే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తున్నారు.
ఈ మేరకు హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న సారథి స్టూడియోలోజనవరి 18న ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ షో ఒక ఎపిసోడ్లో నలుగురు మాత్రమే పాల్గొనే వీలు కల్పించారు. అది కూడా వాళ్లు స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఒకరికి ఒకరు తెలిసి ఉండాలి. ఆ నలుగురు కలిసి ఒకటే టీంగా వెళ్లాలి. వయసుతో సంబంధం లేదు. ఆడిషన్స్కు వెళ్లేటప్పుడు మీ నలుగురు కలిసి ఉన్న ఫొటోస్ తీసుకెళ్లాలి. ఈ ఫొటోను ముందుగానే 9701366614 నంబర్కి వాట్సప్ చేసి మీ గ్రూప్ను రిజిస్టర్ చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఈ షో కేవలం ఆడవాళ్లకు మాత్రమేనండోయ్. ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా పాల్గొనవచ్చు.