టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం, కెరీర్లో ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు. గతంలో మహేష్ నటించిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు ఇప్పటికే సూపర్ హిట్ కొట్టగా, మొన్న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు కూడా సక్సెస్ఫుల్ గా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఆనందం ఆయనతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా వెల్లివిరుస్తోంది. ఇక నిన్న జరిగిన సరిలేరు సినిమా సక్సెస్ మీట్ లో ఎంతో సరదాగా మంచి ఎనర్జీ తో మాట్లాడిన మహేష్ బాబు, 

 

ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులు, ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రెండు రెండున్నర నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్న సూపర్ స్టార్, మార్చి నెలాఖరులో వంశీ పైడిపల్లి సినిమాలో నటించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మహర్షి సినిమా వచ్చి మంచి సక్సెస్ సాధించగా, దానిని మించేలా తదుపరి సినిమా తెరకెక్కనుందని టాక్. అయితే వరుసగా తన సినిమాలకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని తీసుకుంటున్న మహేష్ బాబు, తదుపరి చేయబోయే వంశీ సినిమాకు అతడిని మార్చి మణిశర్మ ని తీసుకోవాలని కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్, తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

నిజానికి మహేష్ తొలి సినిమా రాజకుమారుడు నుండి కొన్నేళ్ల క్రితం త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఖలేజా వరకు దాదాపుగా అన్ని సినిమాలకు సూపర్బ్ మ్యూజిక్ ని ఇచ్చిన మణిశర్మ, కొన్నేళ్ల క్రితం సినిమాలు చాలా వరకు తగ్గించేశారు. అయితే ఇటీవల నాని జెంటిల్ మ్యాన్, రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మళ్ళి ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ, ప్రస్తుతం మెగాస్టార్ 152 మూవీ, వెంకటేష్ అసురన్ రీమేక్, తో పాటు విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలు చేస్తున్నారు. కావున మహేష్ కూడా వంశీ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మని తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరి మహేష్, తన ఫ్యాన్స్ కోరికను ఎంతవరకు మన్నిస్తారో చూడాలి.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: