అరే.. మీరు స్టార్ హీరోల ? లేక టాలీవుడ్ శత్రువుల ? ఈ ప్రశ్నలు పుడుతున్నాయి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి. అవును అసలు వీళ్ళు నిజంగా మనం అభిమానించే సూపర్ స్టార్ల.. స్టైలిష్ స్టార్ల. అసలు ఇన్నాళ్లు కలిసి మెలసి ఉన్న ఈ హీరోలు ఒక్క రెండు సినిమాలతో టాలీవుడ్ పరువు తీసేస్తున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.. వీరి నిర్వాకాల వల్ల ఇద్దరి ఫ్యాన్స్ మధ్య భారీ గొడవలు వస్తున్నాయి. 

 

అసలు వివరాల్లోకి వెళ్తే.. సంక్రాంతి అల్లుళ్ళగా.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రాగ.. అలా వైకుంఠపురములో అంటూ అల్లు అర్జున్ బాబు వచ్చాడు. మొదట అల వైకుంఠపురములో అట్టర్ ప్లాప్ అని ప్రచారం జరిగిన.. సరిలేరు నీకెవ్వరూ సూపర్ హిట్ అని ప్రచారం జరిగిన.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. నిజానికి సరిలేరు నీకెవ్వరూ కంటే కూడా ఆలా వైకుంఠపురములో సినిమాకే మంచి మార్కులు పడ్డాయి. 

 

రేటింగ్ కూడా బాగా వచ్చింది. ఎలా వచ్చిన సరే .. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులకు నచ్చిన.. వారికీ వారికీ వివాదాలు ఉండటంతో సినిమా రిలీజ్ అయినా వారానికి కూడా ఇంకా మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. అసలు ఏమైందంటే.. రెండు సినిమాలు పెద్ద హీరోలవే కావడంతో విడుదలకు ముందు థియేటర్స్, డేట్స్ విషయంలో మొదలైన విభేదాలు విడుదల తరువాత కూడా అలాగే కొనసాగుతున్నాయి.

 

మేము గొప్పంటే మేము అంటూ గొడవపడి టాలీవుడ్ పరువు తీస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ.. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలు పండుగ సీజన్ లో రిలీజ్ కావడంతో.. కొంచం కథ కూడా బాగా ఉండటంతో రెండు సినిమాలను ప్రేక్షకులను బాగా ఆదరిస్తున్నారు. అయితే రికార్డులు, కలెక్షన్స్ విషయంలో మాత్రం ఒకరికి మించి ఒకరు పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.

 

ఆ పోస్టర్లే ఇప్పుడు అభిమానుల మధ్య చిచ్చు పెడుతుంది.. టాలీవుడ్ పరువు సోషల్ మీడియా వేధికగా పోతుంది. నాన్ భాహుబలి రికార్డ్స్ అని ఇద్దరికీ ఇద్దరు పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. ఆ పోస్టర్లు చూస్తే నిజంగా వీళ్లకు అంత ఉందా ? వీళ్ళు చెప్పేవి నిజామా అని కొందరు చూస్తే.. వీళ్ళ పోటీ కారణంగా.. అపద్దపు కలెక్షన్ల కారణంగా అభిమానులు గొడవలు పడుతున్నారు.. ఈ కలెక్షన్ల గొడవల వల్ల ప్రేక్షకులకు టాలీవుడ్ సినిమా అంటే అంత మోసమేలే అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది.. ఇప్పుడు మీరు చెప్పండి.. అసలు ఎవరి సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టింది అంటారు ? 

మరింత సమాచారం తెలుసుకోండి: