టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని సంపాదించడం జరిగింది. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారిగా ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించిన ఈ సినిమాకు యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్ బ్యానర్ల పై మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించడం జరిగింది. మహేష్ కు జోడిగా రష్మిక మందన్న నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా రత్నవేలు ఫోటోగ్రఫీని అందించారు. 

 

సీనియర్ నాయకి విజయశాంతి, 13 ఏళ్ల గ్యాప్ తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. నిజానికి ఈ సినిమాని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఫ్యాన్స్ కి నచ్చే కామెడీ, ఫైట్స్, యాక్షన్ సీన్స్ కలగలిపి తెరకెక్కించిన దర్శకుడు అనిల్, సెకండ్ హాఫ్ ని సాగతీయడం తో పాటు, విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని ఒకింత కామెడీగా చూపించి హీరోకి సరితూగే రేంజ్ లో ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యాడని, అలానే ట్రైన్ ఎపిసోడ్ లోని కొన్ని సీన్స్ పెద్దగా ఆకట్టుకోవని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడడం జరిగింది. 

 

ఇక నిన్నటితో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం జరిగింది. ఇక నిన్నటి ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన మహేష్, సరిలేరు సినిమా ఎంచుకోవడం తన కెరీర్లోనే అత్యుత్తమమైన నిర్ణయం అని తెల్పడం జరిగింది. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో పాటు, మహేష్ బాబు స్టామినా, అలానే దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడంతో థియేటర్స్ కొంత ఎక్కువగా లభించడం వంటి అంశాలు ఈ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ లభించడానికి కారణం అని అంటున్నారు. నిజానికి రేపు రాబోయే సోమవారం తరువాత ఈ సినిమా అసలు పరిస్థితి తెలుస్తుందని, అయితే ఇప్పటికే చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ ని అందుకుని సేఫ్ జోన్ లోకి చేరడంతో, ఇకపై సినిమా పెద్దగా కలెక్ట్ చేయలేకపోయినా పర్వాలేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి రేపు సోమవారం నుండి ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ ని కొల్లగొడుతుందో, ఎంతవరకు నిజమైన కలెక్షన్స్ పరీక్షలో గెలుస్తుందో చూడాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: