టాలీవుడ్ లో ప్రముఖ హాస్య దర్శకులు జంద్యాల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ఈవివి సత్యనారాయణ.  ఎన్నో కామెడీ సినిమాలు తెరకెక్కించి తన మార్క్ చాటుకున్నారు.  ఆయన తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లో హీరోలుగా వెండి తెరకు పరిచయం అయినా.. అల్లరి నరేష్ ఒక్కరే కామెడీ హీరోగా నటిస్తున్నారు.  దర్శకుడు, నటుడు రవిబాబు తెరకెక్కించిన ‘అల్లరి’ మూవీతో వెండి తెరకు పరిచయం అయిన నరేష్సినిమా టైటిల్ తన ఇంటిపేరుగా మల్చుకున్నారు.  టాలీవుడ్ లో అల్లరి నరేష్ సినిమాలంటే ఓ ప్రత్యేకత ఉంటుంది.  ఆ మద్య సుడిగాడు మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కామెడీ హీరో కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు.  మల్టీస్టారర్ మూవీస్ లో కూడా నటించడం మొదలు పెట్టారు. 

 

ఇటీవల సునీల్ తో కలిసి నటించారు. గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ మూవీలో కీలక పాత్రలో నటించాడు.  కెరీర్ బిగినింగ్ లో వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన నరేష్ అతి తర్వరగా 50 సినిమాలు పూర్తి చేశారు. కానీ ఈ మద్య ఈ అల్లరోడికి అస్సలు కలిసి రావడం లేదు. దాంతో సినిమా కథల  విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఆయన 'బంగారు బుల్లోడు' సినిమాను చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

 

ఆయన తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఆ రోజున ఉదయం   హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కెరియర్ పరంగా 'అల్లరి నరేశ్ కి ఇది 57వ సినిమా. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: