టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పై దేశవ్యాప్తంగా ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి కేవలం మన దేశంలోనే కాక, పలు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. అలానే తొలిసారిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాను దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే కాసేపటి క్రితం ప్రముఖ మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కాసేపటి క్రితం చేసిన ఒక ట్వీట్ తో ఈ సినిమా వాయిదా పడింది అనే సంకేతాలు అందుతున్నాయి. 'ఇప్పుడే నాకు ఒక ఎక్స్ క్లూజివ్ న్యూస్ వచ్చింది. సౌత్ ఇండియా సినిమా పరిశ్రమకు చెందిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఒకరు, తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాను వాయిదా వేశారని, అలానే ఆ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది',
అయితే ఆ సినిమా ఏమిటనేది మీరే గెస్ చేయండి అంటూ, తరుణ్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే అయన పోస్ట్ పెట్టిన కాసేపటికే ఆ ట్వీట్ నేషనల్ వైడ్ గా ఎంతో సంచలనం రేపుతోంది. కాగా ఆయన చెప్పిన ఆ సంచలన న్యూస్ తప్పకుండా ఆర్ఆర్ఆర్ మూవీ గురించే చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం అది కెజిఎఫ్ చాప్టర్ 2 కి సంబందించిన న్యూస్ కూడా అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే తన పోస్ట్ తో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరినీ అయోమయంలో పడేసిన తరణ్, ఈ విషయమై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.....!!
#Xclusiv: Guess this one... The big film - being directed by the #Blockbuster director from South India - will have a new release date... According to sources, the biggie will now release in Oct 2020.
— taran adarsh (@taran_adarsh) January 18, 2020