బాహుబలి సినిమాతో తన మార్కెట్ పెంచుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ప్రభాస్ పై అందరి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
బాహుబలి సినిమా తరువాత తర్వాత గతేడాది సాహో అనే భారీ బడ్జెట్ సినిమాతో అభిమానులను అలరించారు. ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ మూవీ కి ఏ మాత్రం తగ్గకుండా విదేశాల్లో భారీ యాక్షన్ సీన్లు తీశారు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ ఏడాది కూడా అదే రేంజ్లో ప్రభాస్ సినిమా ఉంటుందని అంతా భారీగా ఆశలు పెట్టుకున్నారు.


 అయితే ఈ ఏడాది krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో లో ప్రభాస్ సినిమా వెండితెర మీదకు వస్తుందనే ఆశతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఇలా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రభాస్ చేదు వార్త చెప్పాడు. దీంతో ఈ ఏడాది ప్రభాస్ సినిమా థియేటర్ లోకి వచ్చే అవకాశం లేదన్నట్టుగా తేలిపోయింది. ప్రస్తుతం  ప్రభాస్ సినిమా రెండో షెడ్యూల్ మొదలైంది. కాబట్టి ఏడు ఎనిమిది నెలలు షూటింగ్ చేసిన సెప్టెంబర్ అక్టోబర్ సమయానికి సినిమా రెడీ అయిపోతుందని అంత భావిస్తున్నారు.


 కానీ ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న కృష్ణంరాజు మాత్రం అంత హడావుడిగా సినిమాను విడుదల చేసేందుకు ఇష్టపడడం లేదు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేస్తాం అంటూ చెబుతున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో  షెడ్యూల్ మొదలైంది. మూడు నెలల పాటు ఇక్కడే షూటింగ్ చేస్తారు. ఏప్రిల్ మే నెలల్లో విదేశాలకు షూటింగ్ నిమిత్తం వెళ్తారు. ఆ తర్వాత మూడు నెలలు హైదరాబాదులోని షూటింగ్ ఉంటుంది. కనీసం వచ్చే సంక్రాంతి పండుగ నాటికైనా తమ అభిమాన హీరో సినిమా ఉంటుందని భావిస్తున్న ప్రభాస్ ఫాన్స్ కి ఇది నిజంగానే చేదు వార్తే.

మరింత సమాచారం తెలుసుకోండి: