ఈ మద్య బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువగా కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాల ప్రభావం కనిపిస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. పడక సుఖం అందిస్తేనే కొంత మంది అమ్మాయిలకు సినీమా ఛాన్స్ వస్తుందని.. లేదంటే అక్కడి ఛాయల్లోకి కూడా రానివ్వడం లేదని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.  అయితే బాధిత జూనియర్ ఆర్టిస్టులు మహిళా సంఘాలు ఆమెకు మద్దతు గా నిలిచాయి.  అయితే నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని శ్రీరెడ్డి టార్గెట్ చేయడంతో ఆమెపై విమర్శలువచ్చాయి.. ఉద్యమం పక్కకు వెళ్లింది.. మద్దతు ఇచ్చిన వారు వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం ఈ అమ్మడు చెన్నైకి మకాం మార్చి అక్కడ నుంచి సోషల్ మాద్యమాల్లో సెలబ్రెటీలపై కామెంట్స్ చేస్తూ వచ్చింది.

 

ఇక బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా, కంగనా రౌనత్ లు మీ టూ ఉద్యమం ద్వారా గతంలో తమపై జరిగిన లైంగి వేధింపులపై సంచలన ఆరోపణలు చేశారు.  ఇక కోలీవుడ్ లో సింగర్ చిన్మయి ప్రముఖ రచయిత వైర ముత్తుపై ఆరోపణలు చేసింది.  తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్ తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకు 19 సంవత్సరాలని.. అప్పుడే తన అక్కడ రంగోలీపై యాసిడ్ ఎటాక్ జరిగిందని.. భయంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అని అన్నారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో అక్క ట్రీట్మెంట్ కి చేతిలో డబ్బులు కూడా లేవని.. తనకు సరైన చికిత్స చేయించాలని కొన్ని చెత్త సినిమాల్లో కూడా నటించానని చెప్పుకొచ్చింది.

 

తాను సంపాదించే డబ్బుతో అక్కకు 54 సార్లు సర్జరీ చేయించానని.. తన వయసు అమ్మాయిలు అది కావాలి.. ఇది కావాలని.. స్నేహితులతో సంతోషంగా గడిపేయాలని అనుకునేవారు. కానీ నేను మాత్రం ఎంతో మంది చేతుల్లో లైంగికంగా నరకం అనుభవించాను. తల్లిదండ్రులకు చెప్పుకోలేను.. అలా అని చేతకాదని వెనక్కి రాలేదు.. ఆ మొండి పట్టుదలే నాలో ఆత్మస్థైర్యం పెంచిందని అన్నారు కంగనా. ప్రస్తుతం కంగనా నటించిన 'పంగా' అనే సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అశ్వినీ అయ్యర్ తివారీ నటించిన ఈ సినిమాలో కంగనా కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: