నీమనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష కృష్ణన్, తొలి సినిమాతో ఫ్లాప్ ని అందుకుంది. ఆ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన వర్షం సినిమలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిష, అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో మంచి పేరు దక్కించుకుంది. ఆ తరువాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మరొక హిట్ అందుకుని ముందుకు దూసుకెళ్లింది. 

 

ఇక అక్కడినుండి మెల్లగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని ముందుకు సాగిన త్రిష, అటు తమిళ్ లో కూడా పలువురు హీరోల సరసన నటిస్తూ మంచి పేరు గడించింది. ఇక ఇటీవల మాత్రం ఒకింత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్న త్రిష, కొన్నాళ్ల క్రితం వరుణ్ అనే బిజినెస్ పర్సన్ తో కొద్దిరోజలు డేటింగ్ చేసి, ఆపై ఇద్దరు ఫ్యామిలీల పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, వీరిద్దరి పెళ్లి మాత్రం జరుగలేదు. ఇక అక్కడి నుండి మళ్ళి సినిమాలతో బిజీ అయిన త్రిష పెళ్లిపై ఇప్పటికీ కూడా ఆమె ఫ్యాన్స్ లో సందిగ్ధత తొలగలేదు అనే చెప్పాలి. అలానే ఆ మధ్య సూచీ లీక్స్ పేరుతో హీరో రానాతో కలిసి సరదాగా త్రిష దిగిన ఫోటోలు బయటకు రావడంతో, 

 

ఆమె రానాతో ప్రేమలో ఉంది అనే వార్తలు కూడా పుకారయ్యాయి. అయితే వాటిపై త్రిష ఇప్పటివరకు స్పందించలేదు. ఇకపోతే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే త్రిషని కొందరు ఫ్యాన్స్ ఇంస్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తూ నిన్న ఒక ప్రశ్నను అడిగారు. మీ బకెట్ లిస్ట్ లో ఉన్న ఏదైనా ఒక కోరికను చెప్పండి అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన త్రిష, తన పెళ్లి మాత్రం ఖచ్చితంగా లాస్ వేగాస్ లో చేసుకోవాలనే బలమైన కోరిక ఉందని, అది తీరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. అయితే ఆమె సమాధానంతో త్రిష ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనే విషయమై స్పష్టత లేనప్పటికీ, ఆమె అతి త్వరలో పెళ్లి అయితే చేసుకోవడం ఖాయం అనే విషయం ఆమె ఫ్యాన్స్ కు అర్ధం అయింది....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: