యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. అప్పుడప్పుడు చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నాయకుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారంనాడు షెడ్యూల్లో అజయ్ దేవగన్ అరంగేట్రం చేశారు. అతన్ని సాదరంగా ఆహ్వానిస్తూ రాజమౌళి 'మీ రాకకోసం మేము కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాము, మీకు ఇదే మా ఆహ్వానం' అంటూ దర్శకుడు రాజమౌళితో అజయ్ దేవగన్ దిగిన ఫోటోలను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. అయితే ఇప్పటికే 60శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. హీరోయిన్ అలియా భట్, అజయ్ దేవగన్ కోసం వెయిటింగ్. ఈరోజు నుంచి అజయ్ దేవగన్ వస్తున్నాడు. అలియా కూడా వస్తే సన్నివేశాలు ఓ కొలిక్కి వచ్చేస్తాయి. ఇక ఈ షెడ్యూల్ పూర్తయ్యాక విడుదలతేదీపై ఓ క్లారిటీ వస్తుంది.
జూలై 30న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య చాలా కాలం క్రితమే ప్రకటించారు. చిత్రీకరణలో జాప్యం వల్ల విడుదల తేదీపై ఇప్పటికే బాలీవుడ్కు చెందిన ట్రేడ్ అనలిస్టులు తరణ్ ఆదర్శ్, కోమల్ నహతా తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు. తరణ్ ఆదర్శ్ అయితే సినిమా పేరు వెల్లడించకుండా ''సౌత్ ఇండియా బ్లాక్బస్టర్ డైరెక్టర్ తీస్తున్న బిగ్ ఫిలింకు కొత్త రిలీజ్ డేట్.. అందిన సమాచారం ప్రకారం ఆ మూవీ 2020 అక్టోబర్లో రిలీజవుతుంది. ఆ సినిమా ఏదో మీరే ఊహించండి'' అని ట్వీట్ చేశాడు. ఇదిలావ వుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. చరిత్రలో అస్సలు కలవని ఈ రెండు పవర్ఫుల్ పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ ఐడియాతో ఈ సినిమా వస్తోంది.