ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరో హీరో ఫ్యాన్స్‌తో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.  తమ అభిమాన హీరో కోసం దేనికైనా తెగిస్తున్న విషయం తెలిసిందే.  తమ హీరోని ఎవరైనా అనుచిత కామెంట్స్ చేస్తే చాలు.. వారిని టార్గెట్ చేసుకొని ట్రోలింగ్ చేయడం సర్వ సాధారణం అయ్యింది.  ఈ మద్య కొంత మంది అభిమానులు తమ హీరోల మూవీ కలెక్షన్లపై కూడా సైలెంట్ వార్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు కోలీవుడ్ లో కనిపించే ఇలాంటి గొడవలు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఇలాంటి ఘటనలు తీవ్ర సమస్యలకు దారి తీస్తుంటాయి. ఈరోజు సోషల్ మీడియాలో ‘#UnrivalledTamilActors VS #TeluguRealHeroes’ అనే హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

 

తమిళ తంబీలు తమ హీరోలు గొప్ప అంటే.. తెలుగు సోదరులు మా హీరోలే గొప్ప అని అంటున్నారు.  అసలు విషయానికి వస్తే.. తమిళ హీరో ధనుష్ నటించిన 'అసురన్' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ హీరోగా నటిస్తున్నారు. దీనికి 'నారప్ప' అనే టైటిల్ ఫైనల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.  అయితే తమిళ నాట కొంత మంది దనుష్ ఫ్యాన్స్  వెంకీ లుక్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది కాస్త.. తెలుగు సినీ ఫ్యాన్స్, తమిళ సినీ ఫ్యాన్స్ మధ్య యుద్ధంగా మారింది. 

 

దీనిపై స్పందించిన హీరో సిద్ధార్థ్.. సౌత్ ఇండియా ఫ్యాన్స్ లో పైత్యం పెరిగిపోయిందని.. #UnrivalledTamilActors vs #TeluguRealHeroes అంటూ హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ఇంటర్నెట్ ని వేస్ట్ చేస్తున్నారని తెగ ఫైర్ అవుతున్నారు.  దేశానికి యువత వెన్నుముఖ కావాలి.. అంతే కానీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని పనికిమాలిన ఫైట్స్ చేస్తే వచ్చే లాభం ఏంటో వారికే తెలియాలని అంటున్నారు. సిద్ధార్థే కాదు ఎందరో సినీ నటుడు అభిమానుల ఫ్యాన్స్ తీరును వ్యతిరేకిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: