యంగ్ రెబల్ స్టార్ .. డార్లింగ్ ప్రభాస్ హీరోగా జాన్ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోని రిలీజ్ చేసారు. ప్రభాస్ కొత్త లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక సాహో భారీ డిజాస్టర్ తో జాన్ సినిమా విషయంలో ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

ఇక చెప్పలేని కారణాలు చాలానే ఉండటంతో జాన్ షూటింగ్ బాగా లేటయింది. దాంతో 2020 సమ్మర్ కి రావాల్సిన సినిమా మొత్తంగా సంవత్సరం పాటు డిలే అయింది. 2021 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించిన కృష్ణంరాజు ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా టాలీవుడ్ మోస్ వాంటెడ్ హీరోయిన్ పూజాహెగ్దే నటిస్తుంది. అంతేకాదు ముఖ్యమైన పాత్రల్లో మిగతా చిత్ర పరిశ్రమల తారలు కూడా నటిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. బాలీవుడ్ నుంచి కొందరిని సెలెక్ట్ చేసుకున్నారు. 

 

పీరియాడిక్ లవ్ స్టోరీ కావడంతో ఆన్ స్క్రీన్ ప్రభాస్- పూజా రొమాన్స్ హైలైట్ గా నిలువనుందని అంటున్నారు. లవ్ అండ్ రొమాన్స్ కాకుండా మదర్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందట. ఇక ప్రభాస్ కు తల్లి పాత్ర కోసం అలనాటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీని ఎంపిక చేసారని లేటెస్ట్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా సినిమాతో భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ- భోజ్ పురి సినిమాల్లో కూడా నటించి బాగా ఫేమస్ అయ్యారు. ఇక తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన 'ఓంకారం' సినిమాలో నటించారు. 

 

ఇక ఇంతకముందు అడవి శేషు- శివానీ జంటగా ప్రారంభమైన '2 స్టేట్స్' రీమేక్ లో ఓ కీలక పాత్ర చేయడానికి ఓకే చెప్పారు భాగ్యశ్రీ. అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు 'జాన్' లో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ని ఆస్ట్రియాలో ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఆ షెడ్యూల్ లో భాగ్య శ్రీ జాయిన్ కానున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: