పాలిటిక్స్‌కిలోకి వ‌చ్చాక‌ సినిమాల్లోకి రాన‌ని చెప్పారు ప‌వ‌న్. కానీ ఆయ‌న ఫ్యాన్స్ ఆయ‌న సినిమా కోసం ఆశ‌గా చూడ‌డంతో ఆయ‌న తిరిగి పింక్ రీమేక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. దాదాపుగా రెండేళ్ళ దాకా గ్యాప్ వ‌చ్చింది. మొత్తానికి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ళింది. నిన్ననే ఆయ‌న పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. 

 

రెండేళ్ళ గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేసాడు పవన్ కళ్యాణ్... ఎట్టకేలకు పింక్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు. ముందుగా  పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాల‌ను షూట్ చేశారు ద‌ర్శ‌కులు. అయితే నిన్న సడెన్ గా  షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ ఫోటో బయటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక సినిమాలకు స్వస్తి పలుకుతాడేమో అనుకున్న సమయంలో ఫ్యాన్స్ కి సైలెంట్ గా గుడ్ న్యూస్ ఇచ్చాడు.

 

ఇక అదే స్పీడ్‌తో ఎక్క‌డా ఆగ‌కుండా మ‌రో సినిమా కూడా మొద‌లెట్టేశాడు ప‌వ‌న్‌. అవునండి ఇది నిజం ఇదే నెల‌లోమరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం డైరెక్షన్ లో సినిమా చేస్తున్న పవన్ నెక్స్ట్ క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా 27 నుండి సెట్స్ పైకి రానుంది. త‌న డేట్స్‌ని ప‌ది రోజులు ఈ సినిమా కోసం కేటాయిస్తే మ‌రో ప‌ది రోజులు ఆ సినిమా కోసం కేటాయిస్తాడ‌ని స‌మాచారం. 

 

ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ ఉన్నపళంగా ఈ రెండు సినిమాలు చేయడానికి  ముఖ్య‌కార‌ణం ఇద్దరు నిర్మాతలని తెలిసింది.  అవును ఏ.ఎం.రత్నం నుండి ఎప్పుడో ఓ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నాడు పవన్. ఎందువ‌ల్ల‌నో కాని ఆ బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేసినట్లుచేసి తిరిగి మళ్ళీ పక్కన పెట్టేసాడు. ఇక తన బ్యానర్ లో ఒక సినిమా చేయమని ఎప్పటి నుండో పట్టుబడుతున్నాడు దిల్ రాజు. అడ్వాన్స్ ఏమి తీసుకోలేదు కానీ ఎప్పటికైనా నీతో ఒక సినిమా చేస్తా అని అప్పట్లో రాజు కి మాటిచ్చాడు పవన్. అందుకే రాజు బ్యానర్ లో పింక్ రీమేక్ ఏఎం.రత్నం బ్యానర్ లో క్రిష్ సినిమా చేసి వారిద్దరి బాకీ తీర్చబోతున్నాడు. మ‌రి ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్‌లు పూర్త‌యి సినిమా విడుద‌ల‌య్యేవ‌ర‌కు డౌటే అని కొంద‌రు అంటున్నారు. ఎందుకంటే ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు ఏపీ లో హాట్ హాట్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈయ‌న ఇటు పాలిటిక్స్ మ‌రోవైపు సినిమాలు ఏం చేస్తారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: