సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ప్రత్యేక పాత్రలో మెప్పించారు. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సందర్భంగా చిత్రయూనిట్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నామని ప్రకటించారు. 

 

ఇదిలాఉంటే ఈ సినిమాలో బ్లేడ్ గణేష్ పాత్రలో బండ్ల గణేష్ ఓ చిన్న రోల్ చేశాడు. ట్రైన్ లో రౌడీ మూకతో దందా చేసే పాత్రలో బండ్ల గణేష్ పాత్ర కనిపిస్తుంది. సినిమా రిలీజ్ ముందు బండ్ల గణేష్ పాత్ర మీద చాలా హోప్స్ పెట్టుకోగా సినిమా చూశాక అనుకున్నంత రేంజ్ లేదని తేల్చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ డైరక్టర్ అనీల్ రావిపుడి మీద చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. సినిమాలో తన పాత్రని 90 శాతం కట్ చేశారని.. అసలు పూర్తిగా తీసేసినా పెద్దగా ఫీల్ అయ్యే వాడిని కాదని తన సన్నిహితుల దగ్గర అంటున్నాడట.

 

అంతేకాదు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి పాత్రలు నువ్వు చేయడం అవసరమా అనేసరికి మొహం కొట్టేసినట్టు ఫీల్ అయ్యాడట బండ్ల గణేష్. సరిలేరు రిలీజ్ ముందు ట్రైన్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. బండ్ల గణేష్ కామెడీ చేస్తాడని అనుకుంటే ఆ బాధ్యత కూడా తన మీద వేసుకున్నాడు మహేష్. మొత్తానికి సినిమా సక్సెస్ అయినా సరిలేరు టీం చేసిన పనికి బండ్ల గణేష్ మాత్రం అన్ హ్యాపీ అని తెలుస్తుంది. అయితే ఇక మీదట సినిమాలే చేస్తా అంటూ చెప్పిన బండ్ల గణేష్ ఏదో ఒక పాత్ర చేశామా అన్నట్టు కాకుండా ఇలా గొడవ పడటం ఎంత వరకు కరెక్టో ఆలోచించాలి

మరింత సమాచారం తెలుసుకోండి: