టాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాలు చాలా తక్కువే వచ్చాయని చెప్పొచ్చు.. అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అలాంటి సినిమాలు చేశాడు. అయితే ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమాలు చేయాలన్న సాహసం ఎవరు చేయలేదు. మొన్నీమధ్య మురుగదాస్ డైరక్షన్ లో స్పైడర్ సినిమా చేశాడు మహేష్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే అడివి శేష్ చేసిన గూఢచారి సినిమా మాత్రం సూపర్ హిట్టయ్యింది. స్పై థ్రిల్లర్ కథగా వచ్చిన గూఢచారి సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

 

అయితే కృష్ణ వారసుడిగా స్పై థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టాలని ఎప్పటి నుండో ఆలోచనలో ఉన్నాడు మహేష్. అందుకే ఈసారి వంశీ పైడిపల్లితో స్పై థ్రిల్లర్ మూవీ చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ మహర్షితో హిట్ అందుకున్న మహేష్, వంశీ పైడిపల్లి ఈసారి ఓ క్రేజీ స్పై థ్రిల్లర్ మూవీతో వస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది. స్పై థ్రిల్లర్ సినిమాల్లో మహేష్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు.

 

మురుగదాస్ సినిమాతోనే హిట్ కొడతాడని అనుకోగా ఆ సినిమా తలాతోక లేకుండా ఉండటంతో ప్రేక్షకులు నిరాశచెందారు. అందుకే వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే స్పై థ్రిల్లర్ కథ సిద్ధం చేశాడట. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ హిట్లతో జోష్ మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ ఈసారి స్పై థ్రిల్లర్ తో సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. మరి వంశీ మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా రాబోయే ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ త్వరలో తెలియచేస్తారట. ఈ సినిమాలో మహేష్ సరసన కీయరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం సరిలేరు సక్సెస్ ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఈ రెండు నెలలు లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: