2014వ సంవత్సరంలో విడుదలైన పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల' చిత్రంలో స్వామిజీ పాత్రను పోషించిన మిథున్ చక్రవర్తి ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే తన తనయుడు మహాక్షయ్ ఒక తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో ఎయిర్‌టెల్ 4జీ యాడ్స్ ద్వారా ప్రఖ్యాతి చెందిన 24 ఏళ్ల ముద్దుగుమ్మ శషా ఛెత్రీ హీరోయిన్ పాత్రని పోషిస్తుందట.

 

 

ఇకపోతే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ అని కొత్త దర్శకుడు మాధవ్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని హీరో పాత్రకి మహాక్షయ్ సరిపోతాడని  అతని ఫోటోలు చూసిన తర్వాత తాను అనుకున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని రమణ బసవరాజు నిర్మిస్తున్నారు. ఎయిర్‌టెల్ 4జీ ప్రకటనల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శషా ఛెత్రీ గతంలో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' సినిమాలో కథానాయిక పాత్రలో నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ అంతగా పొందలేక పోయింది. మళ్లీ రెండేళ్ల తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతుందన్న విషయం అందరిలో ఆసక్తిని రేపుతుంది.

 

 

వాస్తవానికి శషా ఛెత్రీకి మన తెలుగు స్టార్ హీరోలు అంటే వల్లమాలిన అభిమానం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటివరకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటనలలో చాలా సాంప్రదాయంగా కనిపించిన శషా.. తన సోషల్ మీడియాలో మాత్రం బికినీ ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. అలాగే, తను కొన్ని ప్రైవేట్ పాటలలో చాలా బోల్డ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదేమైనా సినిమాలో పాత్రలను దక్కించుకోవడం కోసం ఎక్స్ పోజింగ్ అనే సూత్రాన్ని ఈ సుందరి కూడా అలవాటు చేసుకుంటుందన్న మాట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: