ఇదే రాసుకొచ్చింది ఓ వెబ్ సైటు .. ఆ వెబ్ సైట్ ఎం రాసింది అంటే.. పవన్ కళ్యాణ్ బాలయ్యను ఆదర్శంగా తీసుకున్నారు అని.. ఒక వైపు రాజకీయాలు మరో వైపు సినిమాలు తియ్యాలని నిర్ణయించుకున్నట్టు.. ఏపీలో ఎన్నికలు ఇంకా సమయం ఉంది. అందుకే ఆ గ్యాప్ లో బాలయ్యలా సినిమాలు చేస్తున్నారు.. 

 

ఇప్పుడు బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ తెలుగులో లాయర్ సబ్ అంటూ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు 25 రోజులు సమయం మాత్రమే ఇచ్చారట. అయితే ఈ నేపథ్యంలోనే అయన మరో రెండు సినిమాలకు కూడా తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఏంటంటే.. క్రిష్ దర్శకత్వంలో ఓ చేయనున్నారట. 

 

ఈ సినిమాను జనవరి 27న ప్రారంభించనున్నట్టు సమాచారం. అంటే సోమవారమే ఈ సినేమాను తియ్యనున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ దొంగగా నటించబోతున్నాడని.. ఇది టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్‌గా నటిస్తున్నారట. 

 

అయితే ఇప్పుడు ఇది అంత పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ కు బాల్యయ్య ఆదర్శం అనే టైటిల్ పై నెటిజన్లు భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లు చూస్తే పవన్ కళ్యాణ్ సైతం షాక్ అయ్యేలా ఉన్నాయి. అంత కామెంట్లు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. బాలయ్య రాజకీయ నాయకుడే.. కానీ చాల తక్కువ సమయం రాజకీయాల్లో ఉంటారు. 

 

అలాగే రాజకీయాలలో ఎవరిని ప్రశ్నించారు.. తన పని తాను చేసుకుంటూ పోతుంటారు.. సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉంటారు. ఇంకా హిందుపూర్ ప్రజలను అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటారు.. వారు కూడా వారి ఎమ్మెల్యే అంటే పెద్ద పట్టించుకోరు అని టాక్. 

 

అయితే ఆ టాక్ పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ బాలయ్యను ఆదర్శంగా తీసుకుంటే.. పవన్ కళ్యాణ్ ఇంకా ప్రశ్నించాడు.. అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. బాలయ్యలా రాజకీయం చేస్తే.. ఇంకా నిన్ను ఎవరు రాజకీయ నాయకుడుల గుర్తించారు పావనోరు అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఆదర్శం న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు ఎం అంటారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: