ఈ మద్య హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తాపత్రయంతో ఉన్నారు. అందం ఉండగానే ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించే క్రమంలో ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు నటనతో పాటు సామాజిక సేవా దృక్పదం ఉన్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అయితే కొంత మంది నటీమణులు ఇదే బాటలో సాగుతున్నారు.. తమకు చేతనైన్నంత సహాయం పేదవారికి చేస్తున్నారు. సమంత, హన్సిక, కాజల్ మరికొంత మంది నటీమణులు పేద విద్యార్థులక, వృద్దులకు, అనాథలకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. హీరోయిన్లలో హన్సిక అనాథ బాలలను దత్తత తీసుకుని వారి సంరక్షణ చూసుకుంటూ, మంచి విద్యని అందిస్తుంటే, సమంత సైతం తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు చేయూత ఇస్తుంది.
కాజల్ ట్రైబల్స్కి చెందిన పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హీరోలే కాదు హీరోయిన్లు సైతం ఇలాంటి మంచి పనులు చేయడంతో నెటిజన్లు వారిని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. తాజాగా వీరి బాటలోనే నడుస్తుంది బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డె. ఆ మద్య దువ్వాడజగన్నాథం మూవీ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న పూజా హెగ్డే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తాజాగా కేన్సర్తో బాధపడుతున్న ఇద్దరు పేద పిల్లలకు వైద్య ఖర్చుల నిమిత్తం 25లక్షల రూపాయల్ని విరాళంగా అందజేసి తన సేవాభావాన్ని చాటుకుంది. అంతేకాదు కేన్సర్ బారిన పడిన వారి వైద్య ఖర్చుల కోసం చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ అమ్మడు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషమే. మొత్తానికి తమ అందాలతో అలరించడమే కాదు.. అపద ఉన్నవాళ్లకు మేము సైతం అంటూ ముందుకు వస్తున్న ఇలాంటి హీరోయిన్లను నెటిజన్లు గుండెల్లో పెట్టుకుంటామని అంటున్నారు.