తమిళ సినిమా రంగానికి చెందిన ప్రముఖ డైరెక్టర్ సుశీంద్రన్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఎప్పటి మాదిరిగానే మార్నింగ్ వాక్ కి సుశీంద్రన్ వెళుతున్న సందర్భంలో బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి నేరుగా వచ్చి అతని ఢీ కొట్టాడు. దాంతో ఆ దెబ్బతో కింద పడ్డ సుశీంద్రన్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ చేతి ఎముక కూడా విరిగిపోయింది. దీంతో వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ప్రైవేటు ఆసుపత్రిలో డైరెక్టర్ సుశీంద్రన్ నీ జాయిన్ చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఎడమ చేయి ఎముక కూడా ఫ్యాక్చర్ కావడంతో సుశీంద్రన్ తీవ్ర నొప్పితో హాస్పిటల్లో జాయిన్ చేయగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది అని అంటున్నారు వైద్యులు.

 

ఇదిలా ఉండగా ఇది యాక్సిడెంట్ కాదని కావాలని కక్ష కట్టి డైరెక్టర్ ని చంపడానికి వేసిన స్కెచ్ అని బైక్ తోలుతున్న వ్యక్తి చాలా స్లోగా నడిచి వెళ్తున్న సుశీంద్రన్ పై ఎటాక్ చేయడం బైక్ తో ఢీ కొట్టి వెళ్ళిపోవటం...అదే సందర్భంలో కొంతమంది వ్యక్తులు పరిగెత్తి సుశీంద్రన్ పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా ఇది ఉద్దేశించి సుశీంద్రన్ పై హత్యాయత్నం చేయటానికి వచ్చారని అంటున్నారు అదే సందర్భంలో వాకింగ్ చేస్తున్న వాకర్స్.

 

దీంతో ఈ వార్త తమిళ సినిమా రంగంలో హాట్ టాపిక్ అయింది. వెన్నల కబడ్డీ కులు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్ కార్తీ హీరోగా వచ్చిన 'నా పేరు శివ' సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా అయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలు రిలీజ్ అయి మంచి ఆదరణ తమిళ సినిమా బాక్సాఫీస్ దగ్గర దక్కించుకున్నాయి. అయితే డైరెక్టర్ సుశీంద్రన్ పై హత్యాయత్నం జరిగిందా..? లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: