ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు టకున్న చెప్పే హీరోయిన్ పూజా హెగ్దె. కెరియర్ మొదట్లో కాస్త తడపడ్డ అమ్మడు డిజే తర్వాత నుండి వరుస హిట్లతో దూసుకెళ్తుంది. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న పూజా హెగ్దె సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఇక ఆ సినిమాతో పాటుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో జాన్ సినిమాలో నటిస్తుంది పూజా హెగ్దె.

 

క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న జాన్ సినిమాను జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ఈమధ్యనే మళ్లీ మొదలైంది. సినిమాలో పూజా హెగ్దె, ప్రభాస్ రొమాంటిక్ సీన్స్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటాయని తెలుస్తుంది. ఇన్నాళ్లు తన సినిమాల్లో హీరోయిన్స్ రొమాన్స్ విషయంలో కాస్త ప్రాముఖ్యత ఇవ్వని ప్రభాస్ జాన్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ తో అదరగొడతాడట.

 

ఎలాగు పూజా హెగ్దె తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. ప్రభాస్, పూజా రొమాన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఈ ఇయర్ సమ్మర్ లో జాన్ రిలీజ్ ప్లాన్ చేసినా అది కాస్త అక్టోబర్ దాకా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేయగా ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కన్నా బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం చేస్తున్న జాన్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రిలీజ్ కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: