పటాస్ సినిమాతో మొదలైన దర్శకుడు అనిల్ రావిపూడి సక్సస్ జర్నీ వరుస గిట్లతో దూసుపోతోంది. కళ్యాణ్ రాం కి మంచి కమర్షియల్ సక్సస్ ని ఇచ్చాడు. ఆ తర్వాత సాయి ధరం తేజ్, రవితేజ, వెంకటేష్, వరుణ్ తేజ్ లకి మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. అయితే ఆ ఉత్సాహంతో చేసిన స్టార్ సినిమా మాత్రం అనిల్ కి గట్టి దెబ్బేసింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను చేసిన దర్శకుడు అనీల్ రావిపూడి ఆయనకి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా చెప్పడానికి అన్నీ మైనస్ లే ఉన్నాయి. దాంతో మహేష్ ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కి ఎక్కలేదు. ఇక ప్రస్తుతం ఎఫ్ 2 హిందీ రీమేక్ కు వర్క్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బోణీ కపూర్ నిర్మిస్తున్న ఎఫ్ 2 రీమేక్ కు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడంటూ.. హిందీ ఎఫ్ 2 స్క్రిప్ట్ విషయంలో అనీల్ రావిపూడి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవేవి నిజం కాదంటూ దర్శకుడు అనీల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.

 

హిందీ ఎఫ్ 2 కు సంబంధించిన ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు .. అంటూ అనీల్ రావిపూడి ప్రకటించాడు. ప్రస్తుతానికి ఆయన పూర్తి దృష్టి మొత్తం ఎఫ్ 3 స్క్రిప్ట్ పైనే ఉన్నట్లుగా సమాచారం. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి కమర్షియల్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న అనీల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో సంక్రాంతికి సక్సెస్ కొట్టాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే సరిలేరు టాక్ బాగా లేకపోవడంతో అందరు అనిల్ ఇదేంటి .ఇలా చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

దాంతో ఈ సారి మళ్ళీ ఆ తప్పు జరగ కూడదని జాగ్రత్త పడుతున్నాడట. అంతేకాదు సరిలేరు దెబ్బ గట్టిగా కాదు బాగా గట్టిగా తగిలింది ...అందుకే ..ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా అంటూ తన సన్నిహితుల దగ్గర అంటున్నాడట. ఇక  ఎఫ్ 3 చిత్రం స్టోరీ లైన్ సిద్దం అయ్యిందని.. హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరితో పాటు మరో హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎఫ్ 2 సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాని ఎఫ్ 2 కు సీక్వెల్ గా రూపొందించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో నటించే ఇంకో హీరో మాస్ రాజా రవితేజ అంటు ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: