వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో గోపీచంద్ ఒక సరికొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న చాణక్య మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ఈ సారి మరింత జాగ్రత్త పడుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో గోపీ చంద్ ఆంధ్రా టీమ్ కి కోచ్ గా వ్యవహరిస్తుంటే ఫీమేల్ లీడ్ తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కి కోచ్ గా వ్యవహరిస్తుంది.

 

 


సంపత్ నంది తన గత చిత్రాలని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. గతంలో గోపీచంద్, సంపత్ నందిల కాంబినేషన్లో తెరకెక్కిన గౌతమ్ నంద ఫ్లాప్ కావడంతో ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ నిలిపాడట. ఎలాగైనా ఈ సినిమా విజయవంతం కావాలనే పట్టుదలతో కృషి చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

 

 

సినిమా పేరును సీటీమార్ గా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్ర బృందం ఆ వార్తలని ఖండించింది. సినిమా పేరును ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఏదైనా తెలుగు పేరునే పెట్టాలని చూస్తున్నారట. అది ఏంటని ఇంత వరకు కన్ఫర్మ్ అవలేదు. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ సినిమాకి ఏ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తారో చూడాలి.

 

 

‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లో చాలా కీలకం కానుంది. అలాగే దర్శకుడు సంపత్ నందికి కూడా విజయం అవసరం. మరి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: