ఒక హీరో చేయాల్సిన కథ మరొక హీరోకి వెళ్లడం అనేది సినిమా ఇండస్ట్రీ లో చాలా మామూలుగా జరిగే విషయం. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో ఇది చాలా సార్లు జరిగింది. వేరే స్టార్ హీరోలు వద్దన్న కథలు బన్నీ ఎంచుకొని హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ప్లాప్ ఐన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మటుకు మన ఆర్య హీరో చేయాల్సిన సినిమా మరొకరి గుమ్మం తొక్కనుంది. 

 

గీత గోవిందం లాంటి అద్భుతమైన విజయం ఇచ్చినందుకు, డైరెక్టర్ పరశురామ్ కి బన్నీ కోసం కథ సిద్ధం చేసుకోమని అల్లు అరవింద్ చెప్పడం, డైరెక్టర్ ఎగిరి గంతేసి కథ సిద్ధం చేయడం జరిగింది. ఆ కథని మొదట బన్నీ తో చేయాలనుకుని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు తో కూడా గీత ఆర్ట్స్ లోనే చేయాలనుకున్నాడు అల్లు అరవింద్. మహేష్ కి కథ నచ్చినా కూడా, అనివార్య కారణాల వల్ల ఈ కాంబినేషన్ కూడా ముందుకెళ్లలేకపోయింది. ఈ లోపు డైరెక్టర్ పరశురామ్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో నాగ చైతన్య తో ఒక సినిమా ఒప్పుకున్నాడు. 

 

మరో వైఫు బన్నీ గాని, మహేష్ గాని ఇప్పట్లో దొరికేలా లేరని, అల్లు అరవింద్ ఈ కథని విజయ్ దేవరకొండకి పంపించారు. ఆయనకి కథ నచ్చి సినిమా చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. పరశురామ్ తను ప్రస్తుతం చేస్తున్న సినిమా అయిపోయిన తర్వాత, విజయ్ కూడా తను ఖాళీ అయినప్పుడు, ఈ కాంబినేషన్ ముందుకెళ్లనుంది. గీత గోవిందం తో పోలిస్తే విజయ్ కి ఇప్పుడున్న మార్కెట్ ఎక్కువ కాబట్టి, గీత ఆర్ట్స్ ఆ బరువంతా తన భుజాల పై మోసే ధైర్యం చేయక, మరో పెద్ద బ్యానర్ తో జత కట్టనుందని తెలుస్తుంది. ఆ వివరాలు త్వరలో బైటికొస్తాయి. ఏదేమైనా ఈ గీత గోవిందం కాంబినేషన్ తెర పైన మరొకసారి చూడాలంటే 2021 లోనే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: