తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తోంది. `అంతకు ముందు ఆ తర్వాత` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మ చేతిలో అయితే పెద్దగా ఆఫర్స్ ఏమి లేవ‌నే చెప్పాలి. బందిపోటు, అమీ తుమీ, వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటి సరైన స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. అయితే నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈషా రెబ్బ‌. ఇక ఈ మద్యే ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది.  అయితే  గ్లామర్ రోల్స్ ని పెద్దగా టచ్ చేయని ఈషా ఇటీవల అదిరిపోయే లుక్ తో కుర్రకారుని అబ్బా అనిపించింది. 

 

ఇక ఇటీవ‌ల‌ రాగల 24 గంటల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో చేసినా అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ సినిమాలో ఈషా రొమాంటిక్ సన్నివేశాల్లో హాట్‌ హాట్‌గా నటించింది. మరోవైపు తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో కూడా తన హాట్‌నెస్‌తో గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొని ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బైక్‌పై రోడ్ షో చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు భద్రతా నిబంధనలను పాటించాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.

 

ఈ నేప‌థ్యంలోనే రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలను సోమవారం ఆయన నెక్లెస్‌రోడ్డు ఐమాక్స్‌ పక్కనున్న హెచ్‌ఎండీఏ మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ హెల్మెట్‌ ధరించి మోటార్‌సైకిల్‌ను నడిపారు. అయితే ఆయనతో పాటే బైక్‌పై ఈషా రెబ్బ ప్ర‌యాణించి వాళ్ల‌ను ప్ర‌త్స‌హించింది. అనంత‌రం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, కారు, ఇతర వాహనాల్లో సీట్‌ బెల్టు పెట్టుకోవాలని మంచి అజ‌య్‌కుమార్‌ సూచించారు. అలాగే నిబంధనలను పాటించకపోవడంవల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. కాగా,ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: