అనసూయ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం యాంకర్గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. రంగస్థలం తర్వాత వరస సినిమాలు చేసింది. హీరోయిన్గా కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి అందం ముందు హీరోయిన్ కూడా పనికిరాదు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అంత హాట్ హాట్గా ఉంటుంది ఈ బ్యూటి. అయితే ఈమె ఇటు జబర్దస్త్ చేస్తూనే అటు జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గాంగ్స్ కార్యక్రమంలో జడ్జ్ కూడా వ్యవహరిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా 'ప్రతిరోజూ పండగే' పేరుతో మల్లెమాల టీవీ ప్రొడక్షన్లో కొత్త షోను చేస్తుంది అనసూయ.
ఈ షో ద్వారా సెలబ్రిటీలతో కలిసి ఆడే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తున్నారు. ఈ షో ఒక ఎపిసోడ్లో నలుగురు మాత్రమే పాల్గొనే వీలు కల్పించారు. అది కూడా వాళ్లు స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఒకరికి ఒకరు తెలిసి ఉండాలి. ఆ నలుగురు కలిసి ఒకటే టీంగా వెళ్లాలి. మరో విశేషం ఏంటంటే.. ఈ షో కేవలం ఆడవారికి మాత్రమే. అయితే ప్రతిరోజూ పండగే కార్యక్రమం ఓపెనింగ్ ఎపిసోడ్ లో హైపర్ ఆది స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఇన్నాళ్లు జబర్దస్త్ వేదికపై అనసూయతో రొమాంటిక్ వేషాలు వేస్తూ ఆమె కోసం పరితపించిన హైపర్ ఆది.. ఇప్పుడు ఆమె ప్రేమ కోసం `ప్రతి రోజు పండగే` వేదికపైకి కూడా వచ్చేశాడు. అంతేకాదు ఆమెకు రోజా పువ్వు కూడా ఇచ్చేసి సిగ్గుమొగ్గలేశాడు.
అయితే ఆ షోలో తాను అనసూయ మనసు గెలుచుకోవడానికి వచ్చాను అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాస్తవానికి ఈ షోలో హైపర్ ఆదికి పెద్దగా పనిలేదు. అయినప్పటికీ కల్పించుకొని వచ్చి, అందులోని లేడీస్ పై హైపర్ ఆది తన పంచులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే నువ్వు నాపై పంచ్ లు వేయడానికి ఇది జబర్దస్త్ కాదు అని అనసూయ అంటుంది. అయినా కూడా హైపర్ ఆది పంచ్ లు ఆగవు. దీంతో అనసూయ కోపంతో అటాక్ అంటూ ఆర్డర్ ఇచ్చేసింది అనసూయ. దీంతో ఆడపడుచులంతా ఒక్కటై హైపర్ ఆదిని చితకబాదారు. అయితే అది కామెడీకే అని అందరికి అర్థం అవుతుంది.