అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమా తో చిన్న బడ్జెట్ లోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సౌత్ వ్యాప్తంగా సినిమా మార్కెట్ పెంచుకుంటూ మరోపక్క వ్యాపార రంగంలో అదేవిధంగా నిర్మాతగా అన్ని విధాల రాణిస్తున్న విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ అనేక విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో గత సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా తన ఫాలోవర్స్ కు తానే కోరికలు తీర్చే క్రిస్మస్ తాత శాంటా క్లాస్ గా మారి ఎవరు ఏది కోరుకుంటే అది గిఫ్ట్ ఇస్తానని సోషల్ మీడియా సాక్షిగా విజయ్ దేవరకొండ మాట ఇవ్వడం జరిగింది. దీంతో చాలా మంది అభిమానులు విజయ్ దేవరకొండ సరదాగా చెబుతున్నాడని అనుకుని చాలా మంది సరదాగా వారికి ఏం కావాలో తెలియజేస్తూ కామెంట్ పెట్టడం జరిగింది. చాలామంది కామెంట్ పెట్టిన వాటిలో విలువైన డబ్బులు పలికే గిఫ్ట్ లు ఉన్నాయి.

 

అయితే క్రిస్మస్ పండుగ అయిపోయి దాదాపు నెలరోజులు పైగానే కావస్తున్నా క్రమంలో విజయ్ దేవరకొండ మాత్రం తాను తన అభిమానులకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా నిజం చేస్తూ ఒక్కొక్కరికి వారు కోరుకున్న గిఫ్టులు పంపించడం స్టార్ట్ చేశారు. తన టీం సహాయంతో ఇటీవల ఒక వ్యక్తికి అక్షరాల లక్ష 50 వేల రూపాయల ఖరీదు కల “ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో” ను పంపి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.దీనితో ఈ విషయాన్ని ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ద్వారా పంచుకొని విజయ్ కు మరియు అతని టీం కు ఓ పెద్ద థాంక్స్ చెప్పాడు. నిజంగా సర్ప్రైజ్ గిఫ్ట్ విజయ్ దేవరకొండ ఇచ్చాడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయం తెలుసుకుని కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: