జాగర్ల మూడి రాధా కృష్ణ ..క్రిష్. ఎంత మంచి డైరెక్టర్ అన్న పేరు సంపాదించుకున్నాడు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె ..ఇలా వైవిధ్య బరితమైన సినిమాలతో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కంచె సినిమా వరుణ్ కి మంచి మైల్ స్టోన్ సినిమా అని చెప్పాలి. ఇక బాలీవుడ్ లో గబ్బర్ ఈజ్ బ్యాక్, మణికర్ణిక సినిమాలను తెరకెక్కించాడు. ఈ రకంగా క్రిష్ కి ఇటి టాలీవుడ్ అటు బాలీవుడ్ లో బాగా క్రేజ్ ని సమాదించుకున్నారు. అయితే వీటన్నిటికంటే నందమూరి నట సింహం బాలకృష్ణ తో తీసిన బాలయ్య 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి బాలయ్య కెరీర్ లో అలాగే క్రిష్ కెరీర్ లో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది. దాంతో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఓ రేంజ్ లో ఆడతాయని అందరు అనుకున్నారు.

 

కానీ ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యయో అందరికీ తెలిసిందే. ఆ రెండు సినిమాలు నందమూరి అభిమానులతో పాటు అందరినీ నిరాశపరచడంతో దర్శకుడు క్రిష్ కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్నాడు. కానీ ఈ గ్యాప్ తో క్రిష్ మీద బాగా గాసిప్స్ వచ్చాయి. ఆయనకి ఇక ఇప్పుడప్పుడే సినిమా ఛాన్స్ రాదని తీసుకుంటే ఆయనే మళ్ళీ ఏ గమ్యం లాంటి సినిమానో తీసుకోవాల్సిందేనని కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ గ్యాప్ లో అదిరిపోయే ప్రాజెక్ట్ సెట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు క్రిష్. పీరియాడిక్ బ్యాగ్డ్రాప్ లో కథ రెడి చేసుకొని పవన్ ని ఒప్పించి సినిమాని ఒకే చేసుకున్నాడు.

 

సినిమా త్వరలోనే  సెట్స్ పైకి వెళ్ళనుందని తాజా సమాచారం. వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమా తర్వాత క్రిష్ మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఆ సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోనే అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో 'కంచె' సినిమా మంచి వసూళ్ళని సాధించింది. దాంతో ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఖచ్చితంగా హిట్ అన్న అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడట. ఈ సినిమా పూర్తవ్వగానే వరుణ్ తో సినిమా మొదలు పెడతాడని అంటున్నారు. మొత్తానికి క్రిష్ ఖాలీ గా ఉన్నాడు అనుకున్న వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలతో సినిమాలు కమిటయి అందరి గట్టి షాకిచ్చాడు. అయితే ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వరుణ్ తో సినిమా చేయాలని వక్కంతం వంశీ ప్లాన్ చేసుకున్నాడట. గత సంవత్సరం బన్ని తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తీసిన వక్కంతం వంశీ తన డెబ్యూ మూవీ అనుకున్నంతగా సక్సస్ కాకపోవడంతో ఈ సారి గట్టిగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో వరుణ్ తో సినిమా అనుకుంటే మధ్యలో క్రిష్ వచ్చి వంశీని ఏడిపించాడని అంటున్నారు. క్రిష్ వల్ల వంశీ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడిందని వంశీ వాపోతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: