టాలీవుడ్ లోకి ఝుమ్మందినాథం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పొన్ను.  మొదటి మంచి విజయం సాధించడం.. ఈ అమ్మడి గ్లామర్ కి కుర్రాళ్లు ఫిదా కావడం జరిగింది.  ఆ తర్వాత తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించిన తాప్సీ తర్వాత తమిళ పరిశ్రమలోకి వెళ్లింది.  తెలుగు, తమిళంలో మంచి విజయాలు అందుకున్న తర్వాత బాలీవుడ్ లో పింక్ సినిమాతో మంచి పేరు సంపాదించింది.    తాప్సీ బాలీవుడ్‌లో ప్రత్యేక పాత్రలు పోషిస్తూ తన దైనశైలిలో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో అభిమానుల ఆదరణను కూడా సొంతం చేసుకుంటోంది.   తాజాగా కరీనా కపూర్ షో ‘వాట్ ఉమెన్ వాంట్-2’లో తాప్సీ పాల్గొంది.

 

ఈ సందర్భంగా ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేసింది. గురుపూజ కోసం ఢిల్లీలోని గురుద్వారాకు కుటుంబ సమేతంగా వెళ్లానని, అప్పుడు అక్కడ విపరీతమైన రద్దీ ఉందని, అదే అదనుగా ఒక ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని వెల్లడించింది. తనపై చేతులు వేసి, ఇబ్బందికరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని, అతని ప్రవర్తన హద్దు మీరడంతో రెండు వేళ్లు పట్టుకుని విరిచేశానని చెప్పింది.  ఈ మద్య సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతున్న విషయం తెలిసిందే.  

 

ప్రస్తుతం రాజకీయ, సినీ, క్రీడారంగాల్లోని ప్రముఖులందరి జీవితాలు ఒకదాని తర్వాత ఒకటిగా తెరకెక్కుతున్నాయి.ఈ నేపథ్యంలో  ‘శభాష్‌ మిథూ’. మహిళా టీమ్ ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌‌ ఇది. ఆమె సారథ్యంలో మహిళా క్రికెట్ టీమ్ ఎన్నో విజయాలను అందుకుంది. ఆ సక్సెస్‌ ఫుల్‌ జర్నీయే సినిమాగా వస్తోంది. మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో వయాకమ్ 18 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడు ఫిబ్రవరి 5న హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: