టాలీవుడ్ లో మోస్ట్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. సంగీత దర్శకులలో అతడికున్నంత పేరు మరెవరికీ లేదు. కానీ గత కొంత కాలంగా అతని పాటల్లో కొత్తదనం కనబడట్లేదు. పాత ట్యూన్లనే మళ్లీ మళ్ళీ కొడుతున్నాడని కంప్లైంట్స్ వస్తున్నాయి. తనకంటే వెనక వచ్చిన వారు కొత్త కొత్త ట్యూన్లతో దూసుకుపోతుంటే దేవి మాత్రం పాత ట్యూన్లనే పట్టుకుని ఉంటున్నాడని విమర్శలు వచ్చాయి.

 

 

మొన్నటికి మొన్న వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పాటలు కూడా సో సోగా అనిపించాయని టాక్ వినబడింది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడని ప్రకటించగానే సోషల్ మీడియాలో దేవి వద్దని చెప్తూ చాలా మంది బహిరంగానే కామెంట్స్ చేశారు. కానీ మహేష్ బాబు అవన్నీ పట్టించుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ కే అవకాశం ఇచ్చాడు.

 

 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాటలు బాగానే ఉన్నప్పటికీ, ఎక్కడో ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అదీ గాక ఈ సినిమాకి పోటీగా వచ్చిన అల వైకుంఠపురములో పాటలు బ్లాక్ బస్టర్ కావడం కూడా దేవిశ్రీ సంగీతం మీద ఎఫెక్ట్ పడింది. ఐతే సరిలేరు నీకెవ్వరు చిత్రం విషయంలో వచ్చిన విమర్శలకు దేవిశ్రీ ఉప్పెన చిత్రంతో చెక్ పెట్టాలని చూస్తున్నారట. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన చిత్రం ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. 

 

 

ఈ చిత్రానికి ఓ రేంజ్ ఆల్బమ్ ఇచ్చి టాలీవుడ్ నంబర్ వన్ నేనే అని నిరూపించుకోవాలని చూస్తున్నాడట. ప్రేమ కథా చిత్రాలకి తనదైన అద్భుతమైన సంగీతాన్ని అందించే దేవి ఈ చిత్రానికి ఎలాంటి మ్యూజిక్ చేస్తాడో చూడాలి.  మొత్తానికి దేవి తన కెరీర్లోనే అత్యంత కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: