టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఒకప్పుడు తన నటన, ఫైట్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో గూఢాచారి, కౌబాయ్, సీఐడి తరహా సినిమాల్లో నటించి మెప్పించారు. తండ్రి మాదిరిగానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ఫైట్స్, నటనతో మెప్పిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ తో భారీ విజయాలు అందుకున్నాడు మహేష్ బాబు. గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
అయితే ఈ మూడు మూవీస్ మెసేజ్ ఓరియెంటెడ్ కావడంతో అభిమానులు కొత్త దనాన్ని కోరినట్లు ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చారు మహేష్ బాబు. ఈ మూవీ లో పదమూడేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా ఈ మూవీ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. మహేష్ ఈ మూవీ బాగా నటించాడని, సినిమా చాలా ఎంటర్ టైనింగ్గా, ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నారు.
‘బ్లాక్ బస్టర్ కా బాప్’గా సినిమా ఉందని, అలాగే నిర్మాత కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బులు ఖర్చు పెట్టారని, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎక్కడా ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా తీశారని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ ఎంటర్టైనర్గా గా ఉందని.. అంతే కాదు ఈ మూవీతో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషం అనిపించిందని అన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపి, కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం విదితమే. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, రావు రమేష్ తదితరులు పలు పాత్రల్లో నటించి మెప్పించారు.