టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీద ఎప్పుడూ లేని విధంగా కొన్ని రోజుల నుండి కొత్త కంప్లైంట్ ఒకటి వస్తోంది. అదే ఆయన చిన్న సినిమాలని అసలు పట్టించుకోవడం లేదని. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటేఅ రాజు గారు ఇంతక ముందు చేసినట్టుగా ఆయన్ బ్యానర్ లో నిర్మించిన కొన్ని చిన్న సినిమాలని అంతగా పట్టించుకోవడం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకు ఉదాహరణగా మొన్నా మధ్య వచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ ఇద్దరి లోకం ఒకటే ..ప్రస్తుతం రిలీజ్ కి సిద్దంగా ఉన్న జాను అని చూపిస్తున్నారు. వాస్తవంగా రాజ్ తరుణ్ సినిమాని దిల్ రాజు ఏంతారం పట్టించుకోలేదు. అసలు కావలిసిన పబ్లిసిటీ చేయల్]నే లేదు. మరి సినిమా రష్ చూశాక ఇలా డిసైడయ్యారా లేదా అన్నది తెలీదు గాని ఇప్పుడు సమంత నటించిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జాను రీమేక్ విషయంలో కూడా ఈయన ఇలాగ్ర వ్యవహరిస్తున్నారు. 

 

చిన్న సినిమా, పెద్ద సినిమా ...ఇలా ఏ సినిమాకైనా జనంలోకి వెళ్ళాలంటే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే రెండు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెడుతుంటారు ఆయా సినిమాల మేకర్స్. కొన్ని సంవ్త్సరాల నుండి అందరూ అదే ప్రాసెస్ ను ఫాలో అవుతుంటారు. కానీ శర్వా సమంత 'జాను' విషయంలో మాత్రం ఎందుకనో అలా జరగడంలేదని చెప్పుకుంటున్నారు. ఇందుకు దిల్ రాజునే అందరూ తప్పు పడుతున్నారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నా కూడా ఎందుకు జాను సినిమాని ఇలా గాలికి వదిలేశారు రాజు అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

కరెక్ట్ గా ఇంకో వారం రోజుల్లో 'జాను' సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతమీన బజ్ ఏర్పడాలి. ఒకటి ఇప్పటికే తమిళంలో పెద్ద హిట్ కాబట్టి తెలుగులో ఎలా తీశారన్న క్యూరియాసిటి పెంచాలి. రెండవది త్రిష ని సమంత మాచ్ చేసిందా లేదా అని. కానీ ఇప్పటి వరకు అలా బజ్ ఏమాత్రం పెరగనే లేదు. అసలు వస్తున్న సంగతే ఎవరికీ తెలీడం లేదు.  కేవలం వారం ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి కానీ అలాంటిదేం జరగట్లేదు. మరి సమంత కి ఈ వారం రోజుల ప్రమోషన్స్ సరిపోతాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప మిగతావి ఏమీ చేయనేలేదు. మరి మేకర్స్ ప్లానింగ్ లేకపోవడంతో వారం రోజుల్లో సినిమా జనాల్లోకి వెళ్ళడం ఓపినింగ్ రాబట్టడం కష్టమే అనిపిస్తుంది.  నిర్మాతగా దిల్ రాజు స్ట్రాటజీ ఏమై ఉంటుందో అని కొంతమంది అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: