టాలీవుడ్ బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం తెరకెక్కుతున్న జాన్ సినిమా షూటింగ్ లో ఎంతో బిజీ బిజీ గా ఉన్నారు. ఇటీవల తన పెద్దనాన్న కృషంరాజు బర్త్ డే లో సందడి చేసిన ప్రభాస్, అతి త్వరలో జరుగబోయే జాన్ లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియెస్ లో భారీ ఎత్తున సెట్టింగులు నిర్మించడం జరిగింది. కొన్నేళ్ల క్రితం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎంతో భారీ రేంజ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. 

 

అయితే ఈ సినిమా విషయమై ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, గతంలో ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సాహో సినిమాని ఎంతో భారీ రేంజ్ లో నిర్మించిన సదరు సంస్థ, ఆ సినిమాలోని సాంగ్స్, అలానే సంగీత దర్శకుడి విషయంలో చివరి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ముందుగా సినిమాకు పనిచేసిన శంకర్, ఎహసాన్, లాయ్ అర్ధాంతరంగా సినిమా నుండి తప్పుకోవడంతో, హఠాత్తుగా చివరికి ఎవరో కొందరు హిందీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కంపోజ్ చేయించిన సాంగ్స్, మన తెలుగు వారికి ఏ మాత్రం నచ్చలేదు. ఇక సినిమా కూడా ఊహించిన రేంజ్ లో లేకపోవడం, అలానే సాంగ్స్ థియేటర్స్ లో కూడా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోకపోవడం కూడా ఆ సినిమా సక్సెస్ కాకపోవడానికి ఒక కారణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

 

ఇక ప్రస్తుతం జాన్ విషయంలో కూడా నిర్మాతలు సాహో మాదిరిగా అదే తప్పును చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు ఎవరు అనే విషయమై ఆడియన్స్ కి ఇంకా క్లారిటీ లేదని, వీరి వరుస చూస్తుంటే మరొక్కసారి సాహో మాదిరిగా చివర్లో సాంగ్స్ రిలీజ్ సమయంలో హడావుడిగా ఎవరో ఒక సంగీత దర్శకుడిని తీసుకుని పాటలు రిలీజ్ చేసే పరిస్థితి నెలకొంటుంది అనే అనుమానం అందరిలోనూ తలెత్తుతుందని అంటున్నారు. అయితే దీనిపై మాత్రం సినిమా దర్శక, నిర్మాతలు ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత బెటర్ అని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: