పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొన్నేళ్ల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్. అంతకముందు కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని పవన్ కు ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. ఇక అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కాంబోలో మరొక సినిమా వస్తే బాగుండు అని పవన్ ఫ్యాన్స్ అప్పటినుండి భావిస్తున్నారు. అయితే ఎట్టకేలకు నేటికి ఆ సమయం రానే వచ్చింది. పవన్, హరీష్ శంకర్ ల కాంబోలో సినిమాని అతి త్వరలో తాము నిర్మించబోతున్నట్లు ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. 

 

ప్రస్తుతం పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్, దాని అనంతరం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే పీరియాడికల్ మూవీ లో నటించనున్నారు. అయితే ఆ సినిమా పట్టాలెక్కి కొంత షూటింగ్ పూర్తి అయిన తరువాత హరీష్ శంకర్ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమా విషయమై ఒక మంచి స్టోరీ రాసుకున్న హరీష్, అతి త్వరలో దాని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ప్రకటన రావడంతో పవన్ ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. తప్పకుండా వీరిద్దరి కాంబోలో మరొక గబ్బర్ సింగ్ రేంజ్ విజయం ఖాయం అని వారు భావిస్తున్నారు. 

 

ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, లతో సినిమాలు నిర్మించిన మైత్రి సంస్థ, ప్రస్తుతం బన్నీ, సుకుమార్మూవీ ని నిర్మిస్తోంది. ఇక నేడు పవన్, హరీష్ ల సినిమాని కూడా నిర్మించబోతుండడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా మైత్రి వారికి మరింత గొప్ప పేరు రానుంది. అయితే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయని, అదే సమయంలో రిలీజ్ టైం ని కూడా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: