టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో పోతినేని రామ్ ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకోవడం జరిగింది. ఈ సినిమా రాకముందు వరకు ఫుల్ ప్లాపుల్లో రామ్ మరియు సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉండటం జరిగింది. ఎప్పుడైతే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందో ఇద్దరి కెరీర్లు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఏడాది జూలై 18 వ తారీకున విడుదలైన ఈ సినిమా రామ్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఇటువంటి తరుణంలో రామ్ కి అదిరిపోయే హిట్ రావడంతో..ప్రస్తుతం ‘రెడ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీలో అరుణ్ విజయ్ నటించిన ‘తడం’ చిత్రం. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా  తమిళంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

 

ఇటువంటి నేపథ్యంలో ఇదే సినిమా పై బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా మనసు పారేసుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. తాజాగా తమిళంలో ఈ సినిమాను చూసి సిద్ధార్థ్ మల్హోత్రా ఇంప్రెస్ అయ్యాడట. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్నేళ్లుగా సౌత్ ఫిలిం మేకర్స్ బలమైన కథలతో సినిమాలు చేస్తున్నారు. దక్షిణాది సినిమా రంగంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఏ సినిమా అయినా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వదిలిపెట్టడం లేదు.

 

దీంతో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన తడం తమిళ ప్రేక్షుకులని మెప్పించింది. తెలుగులో రామ్ నటిస్తున్న రెడ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది. హిందీలో ఈ చిత్రాన్ని వర్ధన్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు. బాహుబలి సినిమా పుణ్యమా అంటూ చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు తెలుగు కథల పై ఇటీవల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా ఫ్లాపుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి అదిరిపోయే విజయాలు అందుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: