వివాదస్పద నటి శ్రీ రెడ్డి మళ్ళీ రెచ్చిపోయింది..ఈ మధ్య ఓకే యు ట్యూబ్ ఛానెల్ పెట్టి వంటలు చేసుకుంటూ పోతుంది.. ఈమె వంటలకి యు ట్యూబ్ లో చాలానే వ్యూస్ వస్తున్నాయి.. సైలెంట్ గా వంటలు చేరుకుంటుందిలె అని చాలా మంది అనుకున్నారు.. కానీ మళ్ళీ మాములే... విమర్శలు ఆగలేదు.. ఈసారి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ని టచ్ చేసింది. మెగా హీరోలపై సంచలన పోస్ట్ చేసింది ఫేస్ బుక్కులో. ఇది చూసి ఫ్యాన్స్‌కు మండిపోతుంది.

 

ఎప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసే శ్రీ రెడ్డి ఇప్పుడు మాత్రం మెగా కుటుంబంపై పడింది. """నాగ శౌర్య లాంటి టాలెంటెడ్ హ్యాండ్ సమ్ హీరోలను తొక్కేయకండ్రా తొక్కలో మెగా హీరోస్ కోసం అంటూ""" ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వివరాలలోకి వెళితే నాగశౌర్య నటించిన అశ్వథ్ధామ సినిమా ఈ వారమే విడుదలైంది. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది.

 

అయితే చాలా చోట్ల అల వైకుంఠపురములో సినిమా కోసం దీనికి సరైన థియేటర్స్ ఇవ్వలేదనే వాదన ఇండస్ట్రీలో ఉంది. అది చూసి ఇప్పుడు శ్రీ రెడ్డి ఇలాంటి పోస్ట్ పెట్టిందేమో అంటున్నారు. అయితే ఇక్కడ శ్రీ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం మరోటి ఉంది. నాగశౌర్య ఏ సినిమాకైనా ముందు చిరంజీవి ఇంటికి వచ్చి అశీస్సులు తీసుకుని వెళ్తాడు.ఛలో నుంచి ఇదే చేస్తున్నాడు. ఆయన కూడా మనస్పూర్థిగా ఆశీర్వదిస్తుంటాడు. అశ్వథ్థామ విడుదలకు ముందు కూడా చిరు ఇంటికి వచ్చాడు ఈయన.

 

కానీ ఇవేం తెలుసుకోకుండా శ్రీ రెడ్డి మాత్రం అనవసరంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తుందంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు అభిమానులు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కి ఫేవర్ గా ఉంటు, జనసేన పార్టీ లో చేరిన లక్ష్మి నారాయణ కి సపోర్ట్ గా పోస్ట్ చేసింది... లక్ష్మి నారాయణ జనసేన పార్టీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. రాజీనామా చేసి మంచి పని చేసావ్, మీ మీద గౌరవం పెరిగిపోయింది అని పోస్ట్ చేసారు అని మెచ్చుకుంది..

 

అయినా కొన్ని రోజులుగా ఎలాంటి వివాదాలు లేకుండా సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ ఉన్నట్లుండి ఇలాంటి పోస్ట్ పెట్టడం ఎవరికీ నచ్చడం లేదు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడ్డారు. అది మరిచిపోకముందే మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఈ సారి కుటుంబాన్నే టార్గెట్ చేసింది. మరి దీని పరిణామం ఇలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: